Lakshmi Parvathi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు వారసులుగా బాలకృష్ణ, జూ .ఎన్టీఆర్ అడుగుపెట్టి సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా బాలకృష్ణతో పోల్చుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కి సినీ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు కూడా ఉంది. మరొకవైపు కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల బాలకృష్ణకు , జూ.ఎన్టీఆర్ కు పడడం లేదు అని చెప్పవచ్చు. అంతేకాదు ఎన్నో సందర్భాలలో ఈ విషయాలు బయటపడ్డాయి కూడా. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 18 వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద చోటు చేసుకున్న పరిణామం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.
బాలయ్యకు కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువ..
ఇక ఆరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వేకువ జామునే జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు వెళ్లి నివాళులర్పించారు. ఆ తర్వాత బాలకృష్ణతోపాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాటుకు చేరుకొని నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా బాలయ్య చేసిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ ఘాటు నుంచి కళ్యాణ్ రామ్ , జూ.ఎన్టీఆర్ వెళ్లిన వెంటనే అక్కడ చేరుకున్న బాలయ్య ఫ్లెక్సీలను ఇప్పుడే తొలగించాలంటూ ఆర్డర్ జారీ చేశారు. అంతే కాదు అందుకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.. ఆ సమయంలో ఈ విషయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో భాగంగానే వెయ్యి మంది బాలయ్యలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఆరోపణలు చేశాడు. అయితే ఈ విషయంపై స్వర్గీయ నందమూరి తారక రామారావు మాజీ భార్య లక్ష్మీ పార్వతి స్పందిస్తూ ఆసక్తి వ్యాఖ్యలు వెల్లడించింది.
బాలకృష్ణ అహంకారం పరాకాష్టకు చేరింది..
ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించిన విషయం వైరల్ అవుతున్న నేపథ్యంలో లక్ష్మీపార్వతి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే లక్ష్మి పార్వతి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పై బాలయ్యకున్న కోపం, ఆక్రోషం ఇప్పటిది కాదు. ఈ సందర్భంగా నాడు బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పులపై కూడా ఆమె స్పందించింది. ఇలాంటి విషయాలు చూస్తుంటే వారి అహంకారం సంకుచితత్వం పరాకాష్టకు చేరుకున్నట్లు అనిపిస్తోంది. నన్ను కుటుంబం నుంచి వెలేసినట్లే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా వెలేశారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆయన స్థాయిలో పేరు తెచ్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ తెలిపింది.
తారక్ వల్లే బెల్లంకొండ సురేష్ పై కాల్పులు..
అంతేకాదు కాల్పుల విషయంపై స్పందిస్తూ బెల్లంకొండ సురేష్ ని కాల్చడానికి కూడా కారణం జూనియర్ ఎన్టీఆర్ సినిమానే. నాడు థియేటర్ ల నుంచి తన సినిమా తీసేసి జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమా వేయడంపై బాలయ్య గొడవ చేసి కాల్పులు జరిపారు. ఆ స్థాయిలో అహంకారం పెరిగిపోయింది. అలా నాడు బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరగడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ పైన ఉన్న ఆగ్రహం, ఆక్రోషమే అంటూ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే ఈ విషయంపై ఎవరైనా ఏదైనా వివరణ ఇస్తారో చూడాలి. ప్రస్తుతం లక్ష్మీపార్వతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.