Chiru-balayya: స్టార్స్‌తో రొమాన్స్ చేయడం ఇష్టమంటున్న స్టార్ నటి

ఖుష్బూ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. అయితే మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఆమెది. ఆమె ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు. చిన్నప్పుడు తన తండ్రి కూడా లైంగికంగా వేధించాడని కామెంట్ చేశారు. దీంతో అది చర్చకు వచ్చింది. అలా ప్రవర్తించిన తండ్రికి లేని సిగ్గు తనకెందుకు అంటూ మరోసారి రియాక్ట్ అయ్యింది ఖుష్బూ.

తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఖుష్బూ. లేటెస్ట్ గా గోపీచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’ సినిమాలో కీలక పాత్ర చేశారు ఖుష్బూ. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్న ఈమె మరోసారి సంచలన వాక్యాలు చేశారు. తనకు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో రొమాన్స్ చేయడం ఇష్టం అని కామెంట్ చేసింది.

చిరు, బాలయ్యే కాదు తన డ్రీమ్ హీరో అమితాబ్ బచ్చన్ అనే ఖుష్బూ చెప్పారు. ఇప్పటికీ తన వద్ద ఆయన పోస్టర్లు ఉన్నాయని వివరించారు. వారసుడు మూవీలో తన 18 నిమిషాల సీన్లు తొలగించారని పేర్కొన్నారు. కాగా ఖుష్బూ నటుడు ప్రభును ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు.

- Advertisement -

ఆ తర్వాత తమిళ డైరెక్టర్ సి. సుందర్ ని పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఖుష్బూ కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు అయిన సంగతి తెలిసిందే. ఆమెకు మెగాస్టార్ చిరంజీవి సహా అందరూ విష్ చేశారు.

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు