Maharshi : నటుడు కన్నుమూత

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే చాలా మంది ప్రముఖ దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది మరణిస్తే, మరి కొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

మహర్షి సినిమాలో రైతుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న గురుస్వామి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. గురు స్వామి కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి లో జన్మించారు. చిన్నప్పటి నుంచి గురుస్వామికి నటన అంటే ప్రాణం. ఉద్యోగం వచ్చిన నటన మారలేదు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు నాటకాలు వేసేవారు.

నటన పైన ఉన్న ఆసక్తితో “విజేత ఆర్ట్స్” సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థ ద్వారా పలు నాటకాలు వేశారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి కంట్లో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన మహర్షి సినిమాలో రైతు పాత్రకు ఎంపికయ్యారు. మహేష్ బాబుతో కలిసి ఆ సినిమాలో అద్భుతంగా నటించారు.

- Advertisement -

గురుస్వామి మరణం పై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ మహర్షి. మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెద్ద సక్సెస్ అందుకోవడంతో పాటు రెండు కేటగిరీల్లో నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు