SSMB 28 : ఫ్యాన్స్ అసంతృప్తి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ” సర్కారు వారి పాట” సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే ఇప్పుడు చాలాకాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం ఇది.

ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే తో పాటు ప్రియాంక అరుళ్ మోహన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు అప్డేట్ రాలేదు. అయితే గురువారం SSMB 28 నుంచి అప్డేట్ అంటూ హడావుడి చేశారు. దీంతో సినిమా నుంచి మహేష్ లుక్ వస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు.

గురువారం సాయంత్రం అభిమానులు ఎంతో ఎదురుచూసిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. మహేష్ లుక్ కోసం ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే దక్కింది. మేకర్స్ పై కొంతమంది అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -

అయితే 2006 ఏప్రిల్ 28న మహేష్ బాబు ” పోకిరి” సినిమా విడుదలై ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. మళ్లీ ఇప్పుడు అదే తేదీన SSMB 28 రావడం కొంత వరకు ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చే న్యూస్ గా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు