Mamta Mohan Das: ప్రముఖ హీరోయిన్ మమతా మోహన్ దాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.. ఈ సినిమాలో నెల్లూరు యాసలో నటించి అద్భుతంగా అబ్బురపరిచింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్ , మలయాళం భాషల్లో కూడా ఆకట్టుకుంది.. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడ్డ ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లపాటు చికిత్స తీసుకొని చివరికి క్యాన్సర్ నుంచి జయించింది.. క్యాన్సర్ తో పోరాటం తర్వాత చాలాకాలం విశ్రాంతి తీసుకున్న మమత గత ఏడాది రుద్రంగి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళం లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె తమిళంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది.. ఈ సినిమా జోన్ 14వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మమత మోహన్ దాస్ కూడా తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
స్టార్ హీరో తో ఎఫైర్ పై క్లారిటీ..
తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా మమత ఎఫైర్ రూమర్స్ గురించి యాంకర్ ప్రశ్నలు సంధించారు.. గతంలో నాగార్జునతో ఈమె కేడీ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎఫైర్ రూమర్స్ డేటింగ్ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదు అని అది కేవలం సినిమా వరకు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది మమతా మోహన్ దాస్.. మొత్తానికి అయితే స్టార్ హీరోతో డేటింగ్ తో వచ్చిన వార్తలకు ఈ ముద్దుగుమ్మ పులి స్టాప్ పెట్టిందని చెప్పాలి. అంతేకాదు తన కెరీయర్లో జరిగిన మరో డేటింగ్ ఎఫైర్ పై కూడా క్లారిటీ ఇచ్చింది.
మంచి తోడు కోరుకుంటున్న మమతా..
గతంలో లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు నేను ఒకరిని ప్రేమించాను.. కానీ మా రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదు.. జీవితంలో రిలేషన్ ఉండాలి.. కానీ దాని వల్ల వచ్చే ఒత్తిడిని మాత్రం నేను కోరుకోను.. ఒకరి తోడు కచ్చితంగా కావాలని మాత్రం అనుకోవడం లేదు.. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను.. ఇక భవిష్యత్తులో నా జీవితం ఎలా ఉంటుందో తెలియదు.. ఇక ప్రస్తుతం ఒక పార్ట్నర్ కోసం వెతుకుతున్నాను.. కాలంతోపాటు అన్ని విషయాలు కూడా బయటపడతాయి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే మమతా మోహన్ దాస్ తాజాగా ఒక తోడు కోరుకుంటుంది అని స్పష్టం అవుతుంది.. మరి త్వరలోనే ఆ తోడు గురించి బయటకు వెల్లడిస్తుందో లేదో చూడాలి.
వారి ప్రసంశలకు ఉప్పొంగిపోతున్న మమతా..
అలాగే ఆమె మాట్లాడుతూ.. నాకు మలయాళీ చిత్ర పరిశ్రమలో వచ్చిన గుర్తింపు కారణంగా ఎంతో సంతోషంగా ఉన్నాను.. ముఖ్యంగా నేను పోషించిన ప్రతి పాత్ర నాకు ప్రశంసలు లభించేలా చేసింది.. అందువల్లే తమిళ్, తెలుగు భాషల్లో సినిమాలు చేసే అవకాశం వచ్చింది.. ఇక మలయాళీ ప్రేక్షకులు ఎప్పుడు నాకు అండగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్ వంటి వారు నాపై ప్రశంసలు కురిపించారంటే ఇక నా స్టేటస్ కూడా పెరిగిందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది మమతా మోహన్ దాస్..ఇక ప్రస్తుతం మహారాజా సినిమాతో మళ్లీ రీయంట్రీ ఇచ్చిన ఈమె ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.. మొత్తానికైతే రీఎంట్రీలో గట్టి కం బ్యాక్ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.