Maname Movie.. వివాదాలకు తావు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోయే అతి కొద్ది మంది యంగ్ హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు.. తన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం మనమే.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్ , ఆయేషా ఖాన్ , వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ , సుదర్శన్, శివ కందుకూరి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు..
ఆకట్టుకుంటున్న మనమే ట్రైలర్..
ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇందులో హీరో, హీరోయిన్ల మధ్య డైలాగ్స్ , శర్వానంద్ కామెడీ టైమింగ్, హేషం అబ్దుల్ వహబ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి.. కథను రివీల్ చేయకుండా ట్రైలర్ ను కట్ చేశారు. శర్వానంద్, కృతి శెట్టి కలిసి ఒక బాబుని పెంచుతున్నట్లు ట్రైలర్లో కనిపిస్తుంది. అయితే ఆ బాబు ఎవరు అనేది తెలియకుండా ట్రైలర్ ని చూపించడం గమనార్హం.చివర్లో..” ఎంత ప్రేమ పెంచుకున్న దగ్గరవుతాం కానీ సొంతం అవలేము కదా” అంటూ కృతి శెట్టి చెప్పే డైలాగ్ మనసుకు హత్తుకుంటుంది. అలాగే తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ కూడా ఈ ట్రైలర్ లో మనం వినవచ్చు.. మొత్తానికైతే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోనున్నట్లు సమాచారం..
చిత్ర బృందంతో గొడవలపై శర్వానంద్ క్లారిటీ..
ఇదిలా ఉండగా మరొకవైపు చిత్ర బృందంతో శర్వానంద్ కి గొడవలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాలపై శర్వానంద్ స్పందిస్తూ తనకు చిత్ర బృందానికి మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏమిటి? అసలు ఎందుకు ఆ విభేదాలు వచ్చాయి? అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు.. చివరిగా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన .. బిగ్ స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండు సంవత్సరాలవుతోంది. ఈ నేపథ్యంలోనే విభేదాలపై క్లారిటీ ఇస్తూ శర్వానంద్ మాట్లాడుతూ… బిగ్ స్క్రీన్ పై కనిపించి.. దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది.. ఇక నుంచి నేను చేసే ప్రతి సినిమా కోసం చాలా కష్టపడతాను.. సినిమా ఫెయిల్ అయినా.. సక్సెస్ అయినా ఆ బాధ్యత నేనే తీసుకుంటాను.. ఈ సినిమా బాగా రావాలని చిత్ర బృందంతో చాలా గొడవ పెట్టుకున్నాను.. సినిమా హ్యాపీగా ఏ రోజూ చేయలేదు.. ప్రతిరోజు గొడవలు పెట్టుకుంటూ .. ఎంతో కష్టపడుతూ సినిమా చేశాము.. ఇప్పుడు కూడా చిత్ర బృందంతో గొడవలు ఉన్నాయి.. అయితే ఈ గొడవలన్నీ కూడా సినిమా బాగా రావడం కోసమే తప్పా.. మరే ఇతర సమస్యల గురించి గొడవలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు శర్వానంద్.. మరి ఇన్ని గొడవలు , కష్టాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమా శర్వానంద్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.