Maname Pre release event: పిఠాపురంలో శర్వా మూవీ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

Maname Pre release event: ప్రామిసింగ్ హీరో శర్వానంద్ దాదాపు రెండు సంవత్సరాల విరామం తీసుకుని మళ్లీ మనమే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు.. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే జూన్ ఒకటవ తేదీన అనగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే.. అలాగే ఇందులో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కుమారుడు విక్రమ్ ఆదిత్య.. విక్రమ్ ఆదిత్య ఈ సినిమాలో చాలా అద్భుతంగా ప్రేక్షకులను అలరించబోతున్నారని నిన్న ట్రైలర్ స్పష్టం చేసిందని చెప్పవచ్చు.

పిఠాపురంలో మనమే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..

Maname Pre release event: Sharva movie event in Pithapuram.. Who is the chief guest..?
Maname Pre release event: Sharva movie event in Pithapuram.. Who is the chief guest..?

ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. జూన్ 5వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పిఠాపురంలో ఘనంగా జరపబోతున్నట్లు సమాచారం.. అంతేకాదు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ రాబోతున్నారని సన్నిహిత వర్గాల నుంచి తాజా సమాచారం అందింది. నిన్న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి రాంచరణ్ రావాల్సి ఉంది.. కానీ నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో పోలీస్ సెక్యూరిటీ తక్కువగా ఉన్న కారణంగా చివరి క్షణంలో ఆయన ఈవెంట్ కి రాలేకపోయారు.. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ సన్నిహిత్యం తోనే చీఫ్ గెస్ట్ గా..

ఇక నిజానికి రామ్ చరణ్, శర్వానంద్ ఇద్దరు మంచి స్నేహితుల అన్న విషయం తెలిసిందే.. బాల్య మిత్రులుగా ఉన్న వీరిద్దరూ.. ఎప్పటినుంచో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.. ముఖ్యంగా శర్వానంద్ ఎక్కువగా రాంచరణ్ కుటుంబంతోనే చాలా సన్నిహితంగా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే అటు శర్వా సినిమా కోసం రామ్ చరణ్ బరిలోకి దిగుతుండగా.. మరొకవైపు తన బాబాయి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు . ఇటు బాబాయ్ కి ఉపయోగపడుతుందనే నేపథ్యంలో సినీ గ్లామర్ ని కూడా పిఠాపురంలో పరిచయం చేయబోతున్నారు రామ్ చరణ్.

- Advertisement -

చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్..

ఒకరు సినిమా పరంగా రామ్ చరణ్ ను ఉపయోగించుకుంటే.. మరొకవైపు రాజకీయంగా కూడా ఈయనను ఉపయోగించుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే శర్వానంద్ , రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఈ పిఠాపురం ని మరింత సినీ గ్లామర్ గా మార్చబోతున్నారనే వార్తలు అయితే స్పష్టమవుతున్నాయి. ఇక జూన్ 5వ తేదీన జరగబోయే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. మరొకవైపు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు.. కాబట్టి అక్కడే ఈవెంట్ జరగబోతోంది.. మరి ఇక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఈవెంట్ కి వస్తారా లేదా అన్న అనుమానాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి అయితే జూన్ 7వ తేదీన రిలీజ్ కాబోయే ఈ చిత్రం ఎవరికీ ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు