Manchu Lakshmi : అయ్యో లక్ష్మక్కకు ఏమైంది.. అంతగా ఏం చేశావ్ తల్లి..

Manchu Lakshmi : టాలీవుడ్ హీరోయిన్ మంచులక్ష్మి ( Manchu Lakshmi ) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతూ ఫొటోలకు పోజులిస్తుంది.. ఏకంగా బికినీ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా మంచు లక్ష్మీ కట్టుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలేమైందని ఆరా తీస్తున్నారు..

తాజాగా మంచు లక్ష్మీ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్స్‌ను షాక్ కు గురి చేస్తోంది. మొఖానికి ప్లాస్టర్స్ దర్శనమిచింది మంచు లక్ష్మీ. ఓ ఫోటోను షేర్ చేసిన మంచు లక్ష్మీ మూతి పగిలిపోయిందంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ. మంచు లక్ష్మీ మూతిపగిలిన ఫోటో చూసి అభిమానులు షాక్ అయ్యారు. దీని గురించి మంచు లక్ష్మీ ఇలా రాసుకొచ్చారు. నా ఫొటో చూశారుగా.. ఇదిగో.. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. అని ఫోటో గురించి చెప్పింది. అసలేమైందంటే.. నేను మోతాదుకి మించి రెండు మాములు ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అంతే. వెంటనే ఇలా అయ్యింది. కొన్ని నిమిషాల్లోనే నా పెదవి అలెర్జీ వల్ల ఇలా తయారయ్యింది. నా పెదవులు పగిలిపోయాయి. లక్కీగా నాతో పాటు అప్పుడు నా ఫ్రెండ్ అయిన ఓ డాక్టర్ ఉన్నారు. దీంతో వెంటనే అలర్జీని కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అతను లేకుండా ఉంటే నా పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయేది. పెదవులు మీదే కాదు నా అరచేతి మీద కూడా ఓ వాపులా వచ్చింది..

manchu lakshmi latest photos viral in social media
manchu lakshmi latest photos viral in social media

ప్రస్తుతం నేను స్టరాయిడ్ తీసుకున్నాను.. అందుకే ఇలా ఉన్నాను అని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె మల్టీ టాలెంటెడ్‌ అన్న విషయం తెలిసిందే.. నటిగా, యాంకర్ గా, నిర్మాత్తగా రానిస్తూ యూత్ కు కనెక్ట్ అవుతుంది.. పలు వ్యాపారాల్లోనూ బిజీగా ఉంది.. మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం కూడా తెగ ట్రై చేస్తుంది.. ఈ మధ్య తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంది. మంచు లక్ష్మి గ్లామర్‌ ట్రీట్ లతో రెచ్చిపోతుంది. ఆది పర్వం అనే సినిమాలో మెయిన్‌ లీడ్‌గా నటించింది. ఇటీవల ముంబై కు మకామ్ మార్చిన లక్ష్మీ అక్కడ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు