Manchu Laxmi: టాలీవుడ్ సినీ నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్య వివాదల్లో ఉంటూ..కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ రచ్చి చేస్తూ ఉంటుంది సినీ నటి మంచు లక్ష్మి. అయితే… అలాంటి సినీ నటి మంచు లక్ష్మి…తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దీంతో జనాలు అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇక సినీ నటి మంచు లక్ష్మి… హైదరాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఓటర్ల పై సినీ నటి మంచు లక్ష్మి చాలా సీరియస్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో లో ఇప్పటివరకు 5 శాతమే ఓట్లు నమోదు కావడం సిగ్గుచేటు అంటూ హైదరాబాద్ ఓటర్ల పై సినీ నటి మంచు లక్ష్మి మండి పడ్డారు. FNCC లో ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత మీడియా తో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. Manchu Laxmi Serious On Hyderabad Voters
నేను కేవలం ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ముంబాయి నుంచి హైదరాబాద్ వచ్చానని తెలిపారు సినీ నటి మంచు లక్ష్మి. కానీ హైదరాబాద్ లో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం బయటికి రాకపోవడం దారుణమంటూ ఆగ్రహించారు సినీ నటి మంచు లక్ష్మి. హైదరాబాద్ నగర ప్రజలు బయటికి వచ్చి ఓటు వేయాలి…సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు సినీ నటి మంచు లక్ష్మి.