Manchu Manoj: ముఖ్యంగా సమాజంలో జరిగే విషయాలపై స్పందించే హీరోలలో సాయి ధరంతేజ్ తో పాటు మంచు మనోజ్ కూడా మొదటి స్థానంలోనే ఉంటారు.. ఈ మేరకు ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అసలు విషయంలోకి వెళితే రెండు రోజుల క్రితం.. తండ్రి కూతుర్ల మధ్య జరిగిన విషయాన్ని అసభ్యకరంగా మార్చి .. యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ చేసిన డిబేట్ చాలా వైరల్ గా మారింది.. ఈ విషయంపై కోపోద్రిక్తుడైన సాయి ధరంతేజ్ ఈ వీడియోని వైరల్ చేస్తూ.. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు ప్రభుత్వాలను కోరడమే కాకుండా తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేశారు..
సాయి ధరంతేజ్ ట్వీట్.. స్పందించిన తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం..
దయచేసి మీ పిల్లలను ఇలాంటి సోషల్ మీడియా మృగాల నుంచి కాపాడే బాధ్యత మీదే అంటూ స్పష్టం చేశారు. ముఖ్యంగా కొంతమంది వాక్ , స్వేచ్ఛ స్వతంత్రం పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. బాధితులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. ఇలాంటి వారి నుంచి బయట పడాలంటే ముందుగా మనం మన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి ..వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయకండి అంటూ కూడా కోరారు.. అయితే ఏ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు బట్టి విక్రమార్క కూడా స్పందించారు.
యూట్యూబర్ పై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు..
అయితే తాజాగా దీనిపై స్పందించిన తెలంగాణ డిజిపి కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. అతడి పై కేసు ఫైల్ చేసినట్లు కూడా క్లారిటీ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ కి రీ ట్వీట్ చేసిన తెలంగాణ డిజిపి అసభ్యకరమైన రీతిలో సంభాషించిన యూట్యూబర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.. అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశామని చిన్నారులను కాపాడేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు డిజిపి..
అమ్మతోడు.. వదిలిపెట్టను అంటున్న మంచు మనోజ్..
అయితే ఇప్పుడు ఈ విషయంపై మంచు మనోజ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు.. వినోదం ముసుగులో ఇలాంటి దారుణాలు జరగడం చాలా ప్రమాదకరం.. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ఇన్స్టాగ్రామ్ ద్వారా హనుమంత్ అనే వ్యక్తిని నేను సంప్రదించాను.. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు.. అయితే ఈరోజు అతడే పసిపిల్లలపై నీచమైన కామెంట్లు చేయడం దారుణం.. దయచేసి ఇలాంటి వారిని అసలు ఉపేక్షించవద్దు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులను విజ్ఞప్తి చేశారు మనోజ్ .. అంతే కాదు “పి. హనుమంత్.. అమ్మతోడు.. నిన్ను వదిలిపెట్టను..” అంటూ ఘాటుగా స్పందించారు కూడా.. ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ ట్వీట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.
క్షమాపణలు చెప్పిన యూట్యూబర్ హనుమంత్..
అయితే ఈ విషయంపై పి హనుమంత్ స్పందించి క్షమాపణలు చెప్పిన సరే.. ఇతడు చేసింది సామాన్యమైన పని కాదు ..కాబట్టి ఇతడిని అరెస్టు చేస్తున్నట్లు తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. మరి దీనిపై ఇంకెంత మంది సెలబ్రిటీలు స్పందిస్తారో చూడాలి.
It’s appalling and intolerable to see individuals like @phanumantwo using social platforms to spread abuse and hate under the guise of humour. This behaviour is not only disgusting but also dangerous.
Over a year ago, I reached out to him through Instagram to support women… https://t.co/jQVlZEPqph
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 7, 2024