Manchu Manoj: మనోజ్‌కి కూడా సోకిన ‘మంచు వైరస్’..!

టాలీవుడ్ లో తరచూ నెటిజన్ల చేతిలో ట్రోల్స్ బారిన పడే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మంచు ఫ్యామిలీ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పచ్చు. ట్రోల్స్ కోసమే పుట్టారా అన్నట్టు ఉంటుంది వీరి వ్యవహార శైలి, మాటతీరు. మోహన్ బాబు మొదలుకొని మంచు విష్ణు, మంచు లక్ష్మి రెగ్యులర్ గా ట్రోల్ర్స్ కి స్టఫ్ ఇస్తూ ఉంటారు. అయితే, మంచు ఫ్యామిలీకి ఉన్న నెగిటివిటీకి భిన్నంగా కాంట్రవర్సీకి దూరంగా ఉండేవాడు మంచు మనోజ్. ఫ్యామిలీ అందరిలోకి మనోజ్ ఒక్కడే జెన్యూన్ పర్సనాలిటీ అన్న ఒపీనియన్ ఉండేది. ఈ మధ్య మంచు మనోజ్ తన ఫ్యామిలీ సరసన చేరినట్టు కనిపిస్తున్నాడు.

గతంలో మా ఎలక్షన్స్ సమయంలో పెయిడ్ బ్యాచ్ అంటూ మెగా కాంపౌండ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో అటు నెటిజన్స్, ఇటు మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు మనోజ్. ఇటీవల కుటుంబ అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో పెట్టి నవ్వులపాలైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మొన్న మీడియా ప్రశ్నించగా, నాకంటే మీడియాకే బాగా తెలుసు అని సమాధానం ఇచ్చి దాటవేసాడు మనోజ్. తాజాగా మరోసారి మీడియా ఆ ఇష్యూపై ప్రశ్నించగా తన నోటిదురుసుతో సమాధానం ఇచ్చారు మనోజ్.

మొన్న జరిగిన ఇష్యూపై మీడియా ప్రశ్నించగా “నాకు సెగ్గడ్డ వచ్చింది, మీరేమైనా గోకుతారా” అంటూ వెటకారంగా సమాధానమిచ్చి ‘మంచు’ తనాన్ని ప్రదర్శించారు. వ్యక్తిగత విషయాల పట్ల గుచ్చి గుచ్చి ప్రశ్నించటం మీడియా అత్యుత్సాహమే కావచ్చు కానీ, మనోజ్ ఈ రకంగా స్పందించటం సరి కాదు. ఎదుటివారికి ఇవ్వాల్సిన కనీస మర్యాదంటూ ఒకటుంటుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోవటం శోచనీయం. ఇంతవరకు కాస్తో కూస్తో ఉన్న మంచి పేరును కూడా పోగొట్టుకునేలా ఉన్నాడు మనోజ్ చేసిన తాజా వ్యాఖ్యలతో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు