Meenakshi Seshadri: ఆ డైరెక్టర్ పై సంచలన కామెంట్లు చేసిన మీనాక్షి.. అడిగిన దానికి నో చెప్పడంతో..!

Meenakshi Seshadri.. ప్రముఖ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆపద్బాంధవుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి పరిచయంలోనే తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. అద్భుతమైన నటనతో, అందంతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈమె దాదాపు 8 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె వయసు 60 సంవత్సరములు. ఈ వయసులో ఇండస్ట్రీలోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తోంది.

Meenakshi Seshadri: Meenakshi who made sensational comments on that director.. but said no to what was asked..!
Meenakshi Seshadri: Meenakshi who made sensational comments on that director.. but said no to what was asked..!

డైరెక్టర్ పెళ్లి చేసుకుంటానంటే నో చెప్పాను..

ఇక అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి శేషాద్రి, తన కెరీర్ లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర సంఘటన గురించి తెలియజేశారు. ఒక బాలీవుడ్ డైరెక్టర్ తనకు ప్రపోజ్ చేశారని, అయితే తాను దానిని అంగీకరించలేదు అని కూడా చెప్పుకొచ్చింది. తన కెరియర్ లో జరిగిన ఈ సంఘటన గురించి మీనాక్షి శేషాద్రి మాట్లాడుతూ.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి తెరకెక్కించిన దామిని సినిమాలో నేను హీరోయిన్ గా నటించాను. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలోనే రాజ్ కుమార్ నాకు ప్రపోజ్ చేశారు. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పారు. కానీ నేను తిరస్కరించడంతో ఆయనకి కోపం వచ్చింది. వెంటనే ఆ సినిమా నుంచి నన్ను తొలగించి, ఇంకో అమ్మాయిని తీసుకోవాలనుకున్నారు. అందుకోసం చాలా వెతుకులాట కూడా జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ పెద్దలు వెంటనే వివాదం సద్దుమణిగేలా చేశారు.. ఆ తర్వాత నేనే మళ్ళీ హీరోయిన్ గా నటించాల్సి వచ్చింది అంటూ తెలిపింది మీనాక్షి చౌదరి.

అందుకే మగాళ్లు ఎక్కువ కాలం నటిస్తారు..

ఇకపోతే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వంటి నటులతో పాటు ఆ తరాలకు చెందిన చాలామంది ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా హీరోయిన్లతో పోల్చుకుంటే హీరోలకు ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. అందుకే వారు ఎప్పుడూ కూడా సినిమాలలో నటిస్తూనే ఉంటారు. కానీ హీరోయిన్స్ అలా కాదు. పెళ్లి, ప్రెగ్నెన్సీ ,పిల్లలకు జన్మనివ్వడం, పిల్లలను పెంచడం వంటి విషయాలకు సంబంధించి చాలా ఉంటాయి. ఇవన్నీ మగవారికి ఉండవు. ముఖ్యంగా వీటన్నింటిని చూసుకొని ఆ తర్వాత కెరియర్ చూసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగరు. అయితే పురుషులు మాత్రం కెరియర్ పరంగా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. నటులకు ఎంత వయసు వచ్చినా వారిని తెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తారు అంటూ మీనాక్షి శేషాద్రి తెలిపింది.

- Advertisement -

రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం.

ప్రస్తుతం మీనాక్షి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా , అవకాశం వస్తే తాను కూడా మళ్లీ రీ యంట్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఆపద్బాంధవుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.అందరిని ఆకట్టుకున్న ఈమె వయసు రీత్యా కొంతవరకు ఈమెలో మార్పులు వచ్చాయి. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఈమెకు అవకాశాలు లభిస్తాయో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు