మెగాస్టార్ చిరంజీవి, సినిమాను నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న పేరు ఇది. తన గ్రేస్, మాస్, బాడీ లాంగ్వేజ్ ను ఎవరు మ్యాచ్ చెయ్యలేరు అని చెప్పొచ్చు. తన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసిన మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు. చివరగా గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకున్న మెగాస్టార్ ప్రస్తుతం “వాల్తేరు వీరయ్య” సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రొమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మీడియాతో ముచ్చటించిన చిరంజీవి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. పవర్స్టార్ పవన్ కళ్యాణ్ను విమర్శించే వ్యక్తుల గురించి మాట్లాడుతూ.తన తమ్ముడు గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే చాలా ఫీల్ అయ్యానని చిరు అన్నారు. పవన్ కళ్యాణ్ తాను పెంచిన తన బిడ్డలాంటివాడని చెప్పుకొచ్చారు మెగాస్టార్.
పవన్కి డబ్బు, అధికారంపై ఎలాంటి కోరిక లేదని, మొన్నటి వరకు పవన్కి సొంత ఇల్లు లేదని చిరు అన్నారు. పవన్ లాంటి గొప్ప, నిస్వార్థ వ్యక్తి అవినీతిని నిర్మూలించాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాడని చిరంజీవి అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణమని, అయితే కొందరు గీత దాటుతున్నారని, ఇది తనను తీవ్రంగా కలవరపెడుతోందని అన్నారు. తన సోదరుడిని తిట్టిన వారే, తమ కుటుంబ కార్యక్రమాలకు పిలుస్తారని చిరు అన్నారు. ఒకవైపు పవన్ని టార్గెట్ చేస్తున్న వారితో మళ్లీ మాట్లాడటం తనకు భయంగా ఉందని చిరు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.