Mollywood: ఆ నలుగురి కోరికలు తీర్చలేక చెన్నై వెళ్ళిపోయా.. పేర్లు కూడా బయటపెట్టిన నటి..!

Mollywood.. ప్రముఖ హీరోయిన్ భావన (Bhavana)పై ప్రముఖ స్టార్ హీరో దిలీప్ (Dileep )చేసిన అత్యాచార ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో మలయాళ ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు అనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగానే కేరళ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి మలయాళం ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది అనే విషయాలను వెల్లడించాలని కోరింది. అందులో భాగంగానే జస్టిస్ హేమ (Justice Hema), సీనియర్ హీరోయిన్ శారద (Sarada)కమిటీ ఒక నివేదికను సమర్పించారు.

Mollywood: Unable to fulfill the wishes of those four people, they left Chennai.. The actress revealed the names too..!
Mollywood: Unable to fulfill the wishes of those four people, they left Chennai.. The actress revealed the names too..!

లైంగిక ఇబ్బందులపై మిను మున్నీర్ కామెంట్స్..

ఈ నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మలయాళ సినీ ఇండస్ట్రీలో నటీమణులకు అవకాశం కావాలంటే బెడ్ రూమ్ కి వెళ్లాల్సిందే అంటూ ప్రథమంగా మొదటి పేజీలో ప్రచురించారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారడంతో మిగతా సినీ ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తూ.. ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక ఇబ్బందుల గురించి ఒక్కొక్కరిగా చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ప్రముఖ మళయాళ నటి మిను మున్నీర్ కూడా సంచలన కామెంట్లు చేయడమే కాదు.. ఆ వ్యక్తి ఒక అడుగు ముందుకేసి ఆ వ్యక్తుల పేర్లు కూడా బయట పెట్టేసింది.

సర్దుకు పోదామన్నా వినలేదు..అందుకే చెన్నై పారిపోయా..

మాలీవుడ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దర్శకుడు రంజిత్ (Ranjith ), నటుడు సిద్ధికి( Siddhiqui ) అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టు లోని తమ పదవులకు రాజీనామా చేశారు. ఇందులో ఒక మలయాళం నటి ఇండస్ట్రీలో తనకి ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. 2013లో ఒక సినిమా కోసం పని చేస్తున్నప్పుడు ముఖేష్ , మణ్యం పిల్ల రాజు , జయసూర్య, ఇడవెల బాబు తనను శారీరకంగా వేధించారని, దూషించారు అని, సర్దుకుపోయి పని చేసుకుందామని ప్రయత్నించాను.. కానీ వేధింపులు తాళలేక మలయాళ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్ళిపోయాను అంటూ ఆమె తెలిపింది.

- Advertisement -

ఆ నలుగురు లైంగికంగా ఇబ్బంది పెట్టారు..

ఈ నలుగురు వల్ల తాను పడ్డ వేదనకు, తన పట్ల దారుణంగా ప్రవర్తించిన తీరుకు తనకిప్పుడు న్యాయం జరగాలి , ఆ నలుగురిపై చర్యలు తీసుకోవాలి , వాళ్లు అడిగిన దానికి తాను ఒప్పుకోలేదు అని, తనతో దురుసుగా ప్రవర్తించారు అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ మలయాళ నటి మిను మున్నీర్ (Minu munneer) .క్యాలెండర్ సినిమా షూటింగ్లో మణ్యం పిల్ల రాజుకు భార్యగా నటించాను. ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా నన్ను ప్రశ్నలు అడిగారు. నా భర్త చనిపోయాడు అని చెప్పినందుకు ఒక్కదానివే సంతోషంగా ఎలా ఉంటున్నావని చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. అలాగే 2018 లో వచ్చిన డే ఇంగోట్ నొక్కి సినిమా సమయంలో జయ సూర్య నన్ను బలవంతంగా వెనుక నుంచి హత్తుకొని ముద్దు పెట్టాడు. మరో నటుడు అయితే రాత్రికి వస్తావా అంటూ నీచంగా మాట్లాడాడు. ఇంకొకరు హోటల్ గదిలో నాపై అత్యాచారం చేయబోయాడు అంటూ మిను చెప్పుకొచ్చింది.

న్యాయం కోసం పోరాటం…

అంతేకాదు ఇలా ఎన్నో సమస్యలను తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్నాను అని ఆవేదన వ్యక్తం చేస్తోంది మిను. ఇప్పుడు వాటన్నింటికీ తనకు న్యాయం జరగాలని తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. మరి మీకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు