Buddy : మేకర్స్ ముందు జాగ్రత్త… సీన్స్ అన్నీ ఎడిట్ చేసేశారట

Buddy : మెగా హీరో అల్లు వారసుడు అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమా ఫైనల్ గా ఆగష్టు 2న థియేటర్లలో విడుదల కాబోతుంది. వరుస పరాజయాల వల్ల రెండున్నరేళ్ల పాటు సినిమాలు చేయలేదు అల్లు శిరీష్. హిట్ల సంగతి అటుంచితే, ఒక మోస్తరు సినిమా కూడా అల్లు శిరీష్ కి ఇప్పటివరకు దక్కలేదని చెప్పాలి. శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమా సక్సెస్ అయినా క్రెడిట్ డైరెక్టర్ కి హీరోయిన్ కి, మ్యూజిక్ డైరెక్టర్లకే ఎక్కువ వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ టైం ఊర్వశివో రాక్షసివో అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులని పలకరించాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఫైనల్ గా ఇప్పుడు బడ్డీ అంటూ ఆక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

Movie makers who reduced the run time of Buddy movie

సీన్లన్నీ ఎడిట్ చేశారట..

అల్లు శిరీష్ నటించిన బడ్డీ మరో ఐదు రోజుల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై బజ్ కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలిసిందే. అల్లు శిరీష్ చాలా కష్టపడుతూ ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బడ్డీ మూవీ రన్ టైం గురించి చెప్పుకొచ్చాడు. శిరీష్ మాట్లాడుతూ, మొదట్లో బడ్డీ మూవీ రన్‌ టైమ్ రెండున్నర గంటలు. తాను సినిమా చూసిన తర్వాత, రన్‌టైమ్ తగ్గించడానికి ఇంకా స్కోప్ ఉందని తనకు అనిపించిందని, ఇది ఇన్‌స్టంట్ డెసిషన్ ని మేకర్స్ తో చర్చించి కొన్ని సీన్లు ఎడిట్ చేయించామని చెప్పుకొచ్చాడు. ఫైనల్ గా ఎడిట్ చేశాక రన్‌టైమ్ రెండు గంటల పది నిమిషాలకు లాక్ అయిపోయింది అని శిరీష్ చెప్పాడు.

- Advertisement -

మేకర్స్ ముందు జాగ్రత్త..

అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలలో కొన్నింటికి రన్ టైం మైనస్ అయిన సంగతి తెలిసిందే. ఇండియన్2 లాంటి చిత్రాలకు రన్ టైం బాగా దెబ్బతీసింది. అందుకే మేకర్స్ ఈ విషయాన్నీ ముందుగానే గ్రహించి ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అల్లు శిరీష్ కెరీర్‌ కి ఎంతో కీలకమైన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు శిరీష్. ఇక ఈ సినిమాలో గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ గా నటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు