Bollywood: బాలీవుడ్ హీరోయిన్ కు సీఎం చంద్రబాబు సాయం !

Bollywood: ముంబైకి చెందిన హీరోయిన్ కదంబరి జెత్వానిని వైసీపీ నేతలు, పోలీసులు చేసిన వేధింపుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో అత్యంత వివాదంగా మారుతుంది. ఈ వ్యవహారంలో ముంబై నుంచి హీరోయిన్ కదంబరిని విజయవాడకు తీసుకువచ్చిన వ్యవహారం… కిడ్నాప్ కేసుగా మారుతుండడంతో ఈ ప్రమాదం రాజకీయ నేతలకు, పోలీస్ అధికారులకు చుట్టుకునేలా కనిపిస్తోంది. హిందీ హీరోయిన్ కదంబరి తో విజయవాడకు చెందిన ప్రముఖ వైసిపి నేత కుమారుడు ప్రేమ వ్యవహారం నడిపించారు.

అయితే పెళ్లి వరకు వచ్చేసరికి కుటుంబం వ్యతిరేకించడంతో సదరు ప్రేమికుడు ప్లేట్ మార్చారు. అయితే ఆ అమ్మాయి వినకపోవడం బెదిరింపులకు పాల్పడడంతో రాజకీయ నేత తన పార్టీ కీలక నేతలకు తన కుమారుడి వ్యవహారాన్ని తెలియజేశారు. దాంతో అప్పటి ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన నేత నిర్ణయంతో పోలీసు రంగంలోకి దిగారు. అయితే ముందుగా హీరోయిన్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో పోలీసు అధికారులు ముంబైకి వెళ్లారు.

బాధితురాలు హీరోయిన్ కుటుంబాన్ని బెదిరించడం జరిగింది. వారిని విజయవాడకు తీసుకొచ్చారు. ఆ తర్వాత 14 రోజుల పాటు ఓ గెస్ట్ హౌస్ లో బంధించి వేధింపులు చేశారు. అయితే ఈ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే.. ఈ కేసు వెనుక ఉన్నది వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ అని సమాచారం. ఇదిలా ఉండగా…. తాజాగా వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ కు చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉన్నట్లు నటి కదంబరి జెత్వాని సంచలన వాక్యాలు చేశారు.

- Advertisement -
Mumbai Heroine Kadambari Jethwani

అందుకే అతడిని దూరం పెట్టినట్లుగా చెప్పింది. “2015లో విద్యాసాగర్ తో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన నాతో పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చాడు. దీంతో నేను తిరస్కరించాను. ఆ కోపంతో నాపై దొంగ కేసు పెట్టారు. ఆ కేసులో నన్ను, నా కుటుంబాన్ని పోలీసులు చిత్ర హింసలు పెట్టారు. నన్ను హింసించిన పోలీసులకు తప్పకుండా శిక్ష పడాలి. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత నాకు అండగా నిలబడి న్యాయం చేయాలి” అని ఆమె కోరడం జరిగింది. దీంతో చంద్రబాబు సర్కార్‌ కూడా రంగంలోకి దిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు