Mythri Movie Makers : డిస్ట్రిబ్యూటర్లుగానూ పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు..

Mythri Movie Makers : టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటి మైత్రి మూవీ మేకర్స్. ఈ బ్యానర్ లో వచ్చిన బడా చిత్రాలన్నీ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని రికార్డులు క్రియేట్ చేసాయి. రంగస్థలం, పుష్ప వంటి విజయాలతో భారీ లాభాలను కూడా వెనకేసుకున్నారు. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి కలిసి ఈ నిర్మాణ సంస్థ స్థాపించగా, కెరీర్ మొదటి నుండి మంచి విజయాలు సాధిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. శ్రీమంతుడు తో మొదలైన వీరి విజయ ప్రస్థానం జనతా గ్యారేజ్, రంగస్థలం, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ విజయాలతో అప్రతిహతంగా ముందుకు సాగుతుంది. పెద్ద సినిమాలే కాదు.. ఉప్పెన వంటి చిన్న సినిమాలతో కూడా పెద్ద సక్సెస్ లు సాధించి సూపర్ హిట్లను అందుకున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లుగానూ రానిస్తున్నారు. బడా మూవీస్ ని నైజాం హక్కులను కొని భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.

Mythri Movie Makers has acquired the rights of Kanguva and Goat movies

డిస్ట్రిబ్యూటర్లుగా టాప్ మూవీస్…

ఇక మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా టాప్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే, బడా సినిమాల నైజాం హక్కులని కొనుగోలు చేస్తూ, ఇక్కడ రిలీజ్ చేస్తూ మంచి లాభాలు వెనకేసుకుంటున్నారు. ఆది పురుష్, సలార్, హనుమాన్ వంటి భారీ చిత్రాలను నైజాం లో విడుదల చేసి భారీ లాభాలను అందుకున్నారు. అంతే కాదు మంజుమ్మేల్ బాయ్స్ వంటి చిన్న సినిమాలు కూడా కొనుగోలు చేసి లాభాలు అందుకున్నారు. చాలామంది నిర్మాతలు ఇప్పుడు మైత్రి వారు ఓ సినిమా కొనుక్కున్నారంటే అది హిట్ అయినట్టే అనేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరో రెండు భారీ తమిళ్ ప్రాజెక్ట్స్ ని మైత్రి మూవీస్ మేకర్స్ వారు నైజాం హక్కులను మంచి రేటుకు దక్కించుకున్నారని తెలుస్తుంది.

- Advertisement -

ఆ రెండు చిత్రాలు మైత్రి చేతికే..

ఇక టాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న క్రేజీ డబ్బింగ్ సినిమాల్లో గోట్, కంగువ సినిమాలు కూడా ఉన్నాయి. విజయ్ నటించిన గోట్ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నైజాం రేటుని 8 కోట్లకి కొన్నట్టు సమాచారం. అలాగే సూర్య కంగువ ని కూడా నైజాంలో మైత్రి వారు 7 కోట్ల వరకు చెల్లించి కొన్నట్టు తెలుస్తుంది. ఇవే కాక విదా ముయార్చి కూడా మైత్రి చేతికే వెళ్లే అవకాశం ఉంది. ఇలా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా భారీ సినిమాలను కొనుగోలు చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ దూసుకుపోతున్నారు. ఇక వీరి బ్యానర్ లో ప్రస్తుతం పుష్ప ది రూల్, ఉస్తాద్ భగత్ సింగ్, RC16, ప్రభాస్ – హను మూవీ, ఎన్టీఆర్31 సినిమాలు రూపొందనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు