Mythri movie makers: మెగా హీరోతో మైత్రి మూవీ మేకర్స్ ను టచ్ చేసిన యంగ్ డైరెక్టర్

Mythri movie makers: శ్రీమంతుడు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. అయితే ఈ బ్యానర్ అతి తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటిగా నిలబడింది. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ హౌసెస్ గురించి మాట్లాడుకుంటే మైత్రి మూవీ మేకర్స్ గురించి కూడా ఖచ్ఛితంగా మాట్లాడుకోవాలి. చాలామంది స్టార్ హీరోలతో సైతం ఈ సంస్థ సినిమాలు నిర్మించింది. ఇకపోతే స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా చాలామంది అప్కమింగ్ ఫిలిం మేకర్స్ ని యంగ్ డైరెక్టర్స్ ని కూడా ఈ సంస్థ ప్రోత్సహించింది అని చెప్పాలి.

ఈ సంస్థకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప టు సినిమాను కూడా నిర్మిస్తుంది ఈ సంస్థ. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ ఒక మెగా హీరోతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు అని అనిపించుకున్నాడు ఈ సినిమాతో, ఈ సినిమా తర్వాత చేసిన చాలా సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అయ్యాయి.

Varun Tej

- Advertisement -

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో వరుణ్ తేజ్ చేస్తున్న ఏ సినిమా కూడా పూర్తిస్థాయి విజయాన్ని అందుకోవట్లేదు. వరుసగా డిజాస్టర్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు వరుణ్. ఇకపోతే ప్రస్తుతం కరుణ్ కుమార్ దర్శకత్వంలో వరుణ్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రం సిరికొండ అనే దర్శకుడు తో ఒక సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ సిరికొండ అనే దర్శకుడు ఇంతకుముందు రవితేజ హీరోగా టచ్ చేసి చూడు అనే సినిమాను చేశాడు. కానీ ఆ సినిమా సక్సెస్ ను టచ్ చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ను టచ్ చేసి మంచి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు