Nabha Natesh: యాక్సిడెంట్ తర్వాత మళ్లీ మీడియా ముందుకు.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

Nabha Natesh.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు సక్సెస్ అవుతారో? ఎవరు ఫెయిల్యూర్ అవుతారో? అనే విషయం చెప్పడం అంత సులభం ఏమీ కాదు.. కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ కూడా ఒకరు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. ఉన్నట్టుండి కెరియర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరం అవడంతో అందరూ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేశారు.

Nabha Natesh: After the accident again before the media.. Emotional comments viral..!
Nabha Natesh: After the accident again before the media.. Emotional comments viral..!

కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే యాక్సిడెంట్..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఇండస్ట్రీకి తాను ఇంతకాలం దూరం అవడానికి గల కారణాన్ని వెల్లడించింది. నభా నటేష్ మాట్లాడుతూ.. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది.. భుజానికి తీవ్ర గాయం కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాను… ఇప్పుడు పూర్తిగా కోలుకొని మళ్లీ సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యాను అంటూ చెప్పుకొచ్చింది నభా నటేష్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న డార్లింగ్ అనే సినిమాతో మళ్లీ హీరోయిన్గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరిగింది..? ఆ సమయంలో మైండ్ సెట్ ఎలా ఉంది? అనే విషయాలను కూడా పంచుకుంది.

యాక్సిడెంట్ తర్వాత మీడియా ముందుకు..

నభా నటేష్ మాట్లాడుతూ.. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయ్యింది. ఒక రకమైన మైండ్ సెట్ లోకి వెళ్లిపోయాను.. కానీ ఆపరేషన్ అయిన పది రోజులకే నేను షూటింగ్లో పాల్గొన్నాను. ఆ ఎఫెక్ట్ శరీరంపై పడింది.ఇంకొక సర్జరీ జరిగింది.. దీంతో నా శరీరానికి కచ్చితంగా విశ్రాంతి కావాలని అనుకున్నాను. అందుకే ఆరోగ్యం పైన పూర్తిగా దృష్టి పెట్టి, దాదాపు 6 నెలలు విశ్రాంతి తీసుకున్నాను.. ఫిజికల్ గా ఫిట్ లేకపోతే ఏ పనులు చేయలేము.. అందుకే సమయం తీసుకున్నాను. ఇప్పుడు ఫిజికల్ గా , మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యాకే మళ్లీ సినిమాల్లోకి వచ్చాను అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అవ్వడంతో అవకాశాలు కోల్పోయాను.. ఆ సమయంలో ఎంతో బాధను అనుభవించాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది.

- Advertisement -

డార్లింగ్ సినిమాతో రీయంట్రీ..

ఇకపోతే ఇస్మార్ట్ శంకర్ లాంటి కమర్షియల్ సినిమా తర్వాత డార్లింగ్ లాంటి సినిమా ఎందుకు చేస్తున్నావని అడిగారు.. కానీ ఆడియన్స్ కి తెలుసు.. కంటెంట్ అనేది న్యూ కమర్షియల్ అని.. డైరెక్టర్ అశ్విన్ చెప్పిన క్యారెక్టర్..తాను నన్ను అప్రోచ్ అయిన విధానం.. రెండూ కూడా సినిమాకి ఒప్పుకోవాల్సి వచ్చింది.. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. నాకు దర్శికి గొడవలు ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు.. అలాంటిదేమీ లేదు ఇది జస్ట్ సినిమా ప్రమోషన్ మాత్రమే అంటూ తెలిపింది నభా నటేష్ అంతేకాదు యాక్సిడెంట్ తర్వాత తాను ఏం రియలైజ్ అయ్యానో కూడా చెప్పుకొచ్చింది.. మొత్తానికి అయితే ఆరు నెలలు విశ్రాంతి తర్వాత మళ్లీ డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నభా నటేష్ తన నటనతో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు