Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీకి చివరికి మళ్ళీ అదే దిక్కైంది 

సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది నభా నటేష్. అయితే ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో నభా నటేష్ కి పెద్దగా గుర్తింపు లభించలేదు.

ఆ తరువాత నభా నటేష్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ శంకర్ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. చాందిని పాత్రలో నభా నటేష్ పర్ఫామెన్స్ కి ఈ సినిమాలో మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవడంతో వరుస అవకాశాలు వచ్చాయి.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత నభా నటేష్ రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో నటించింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. దాంతో ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ డిస్కో రాజా తీసుకెళ్ళిపోయినట్టైంది. ఆ తరువాత ఆమె సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సోలో బతుకే సో బెటర్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఒక మోస్తరు గా ఆడిన, నభా నటేష్ కెరీర్ కి మాత్రం ఏ విధంగానూ హెల్ప్ అవలేదు. ఆ తరువాత నభా నటేష్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన అల్లుడు అదుర్స్ , నితిన్ తో మాస్ట్రో సినిమాల్లో కనిపించింది. వీటిలో మాస్ట్రో సినిమా పరవాలేదనిపించిన క్రెడిట్ మాత్రం తమన్నాకే దక్కింది.

- Advertisement -

ప్రస్తుతం నభా నటేష్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 గా తెరకెక్కబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాని ఈ మధ్యనే ఎనౌన్స్ చేసారు. పార్ట్1 లో రామ్ పోతినేని, నభా నటేష్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవడంతో, పార్ట్ 2 లో కూడా నభా నటేష్ ట్రాక్ ని కంటిన్యూ చేయడానికి చూస్తున్నారంట పూరి. దీన్ని బట్టి చూస్తే ఎట్టకేలకు నభా నటేష్ కి ఒక్క మరో సినిమా చేతిలోకి వచ్చిందన్నమాట.

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు