Nag Ashwin: తెలుగు సినిమా పరిశ్రమంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో వైజయంతి మూవీస్ ఒకటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఈ బ్యానర్ నిర్మించింది. బ్యానర్ పై అశ్విని దత్ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అయితే ఒక సమయంలో ఈ బ్యానర్ కూడా తీవ్రమైన నష్టాలను చవిచూసింది. ఇకపోతే మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన శక్తి సినిమా వైజయంతి బ్యానర్ కు తీవ్రమైన నష్టాలను తీసుకొచ్చింది ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకుడుగా పరిచయమైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా పరవాలేదు అనిపించుకుంది. నాగ్ అశ్విన్ దర్శకుడుగా పరిచయం అవడంతో పాటు అశ్విని దత్ అల్లుడు కూడా అయిపోయాడు.
ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వస్తుంది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి అనేక వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ దీపికా పదుకొనే అమితాబచ్చన్ వంటి పెద్దపెద్ద స్టార్ కాస్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లేకపోతే ఈ సినిమాలో మరికొందరు నటులు కూడా ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా గురించి పళ్ళు రకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.
కల్కి సినిమాలో దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ కూడా కృష్ణుడు పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రాలేదు. అలానే సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ సినిమాలో భాగం అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో గ్రాఫిక్స్ తో సీనియర్ ఎన్టీఆర్ ను క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే నాగ్ అశ్విన్ చేశాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అలానే దుర్యోధనుడు పాత్రలో రానా కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అలానే అర్జునుడు పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ సరైన క్లారిటీ రావాలి అని అంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు. ఇకపోతే ఒకవేళ వాస్తవంగా ఇవన్నీ జరిగితే ఇక కల్కి సినిమా సంచలనం సృష్టిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.