Naga Chaitanya.. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉండగా.. మరొకవైపు వ్యక్తిగత జీవితం లో ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు సంవత్సరాలుగా రహస్యంగా రిలేషన్ లో ఉన్న శోభిత దూళిపాల(Sobhita dhulipala) తో నిశ్చితార్థం చేసుకున్నారు. అతి కొద్దిమంది సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరగగా.. ఏడాది చివర్లో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఇకపోతే నాగచైతన్య కూడా తన తల్లిదండ్రుల్లాగా రెండో వివాహం చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే, నాగచైతన్య తండ్రి నాగార్జున (Nagarjuna ), దగ్గుబాటి లక్ష్మీ (Daggupati Lakshmi)ని వివాహం చేసుకొని విడాకులు తీసుకొని అమల(Amala)ను పెళ్లి చేసుకోగా.. లక్ష్మి (Lakshmi) నాగార్జున నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంది.
నాగచైతన్య స్టెప్ ఫాదర్ ఎవరంటే..
ఇప్పుడు నాగచైతన్య కూడా గతంలో సమంత (Samantha) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమెతో విభేదాలు వచ్చి విడిపోయి ఇప్పుడు శోభితతో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అమల వీరందరి గురించి అందరికీ తెలుసు కానీ నాగచైతన్య తల్లి , నాగార్జున మాజీ భార్య దగ్గుబాటి లక్ష్మి ఎవరిని వివాహం చేసుకుంది .. అసలు ఆ వ్యక్తి ఎవరు ? అతడు బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? అనే విషయాలు మాత్రం చాలావరకు తెలియదనే చెప్పాలి.
శ్రీరామ్ మోటార్స్ సంస్థ అధినేత తో లక్ష్మీ పెళ్లి..
ఇటీవల నాగచైతన్య – శోభిత నిశ్చితార్థ వేడుకల్లో దగ్గుబాటి లక్ష్మి తన రెండవ భర్తతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ విషయాలు కాస్త మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు వరుస సినిమాలు చేసేవారు. అలా వారిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఆ బంధాన్ని మరింతకు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో భాగంగా నాగార్జునకి , దగ్గుబాటి లక్ష్మి ని ఇచ్చి వివాహం జరిపించారు. నిజానికి దగ్గుబాటి లక్ష్మి అమెరికాలోనే పెరిగారు.. మరొకవైపు నాగార్జునకు సినిమాలంటే ఇష్టం. ఇద్దరికీ కుమారుడు నాగ చైతన్య జన్మించిన తర్వాత దగ్గుబాటి లక్ష్మి అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అవుదాం అన్నది .. కానీ ఈ విషయం నాగార్జునకు నచ్చలేదు. ఇక తరచూ ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.. దీనికి తోడు నాగార్జున అమలాతో ప్రేమలో పడడం, అన్నీ కూడా జీర్ణించుకోలేకపోయిన లక్ష్మీ, నాగార్జునకు విడాకులు ఇచ్చి అమెరికా వెళ్ళిపోయింది.. అక్కడే ఒక వ్యక్తిని వివాహం కూడా చేసుకుంది. ఆయన ఎవరో కాదు శ్రీరామ్ మోటర్స్ అనే సంస్థను నడుపుతున్న శరత్ విజయరాఘవన్(Sarath Vijaya Raghavan).. ఇతడిని మళ్లీ వివాహం చేసుకున్న లక్ష్మి, తన భర్తతో కలిసి అమెరికా లోనే స్థిరపడిపోయింది.
ముగ్గురూ.. రెండు వివాహాలు..
అయితే మరొకవైపు తన తల్లి లక్ష్మి రెండో వివాహం చేసుకోవడం ఇష్టం లేక నటుడు నాగచైతన్య తన తండ్రితోనే ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే అవన్నీ అసత్యాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల మదర్స్ డే సందర్భంగా కూడా నాగచైతన్య తన తల్లి లక్ష్మితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశాడు, చైతు నిశ్చితార్థ వేడుకల్లో కూడా లక్ష్మి తన రెండవ భర్త , కుమారుడు, కోడలితో వచ్చి సందడి చేసింది. ఇక మొత్తానికైతే అటు నాగార్జున ,ఇటు లక్ష్మీ, అటు నాగచైతన్య ముగ్గురూ కూడా రెండు వివాహాలు చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు.