Naga Chaitanya: పదేళ్ల క్రితం అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ మనం. ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు అవుతుండగా ఈ మూవీని రీ రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు మేకర్స్. నాగార్జున, ఏఎన్ఆర్, నాగచైతన్య కలిసి నటించిన ఈ మూవీ క్లాసిక్ గా నిలిచింది.
డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఈ మూవీ రూపొందింది. ఇక పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం రీ రిలీజ్ అయింది. ఈ మూవీలో నాగార్జున కి జోడిగా శ్రీయ.. నాగచైతన్య కి జోడిగా సమంత నటించింది. ఇక వీరి మధ్య పండే కెమిస్ట్రీ హైలెట్గా నిలిచింది. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో నాగచైతన్య పాల్గొన్నారు. దేవి థియేటర్ కి నాగచైతన్య వచ్చినప్పుడు అభిమానుల హడావిడి అంతా ఇంతా కాదు.
ఈ స్పెషల్ షో కి నాగచైతన్య తో పాటు డైరెక్టర్ విక్రమ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఇక ఇదే క్రమంలో సమంతతో నాగచైతన్య పెళ్లి సన్నివేశం రాగానే ఫ్యాన్స్ సీట్లలో నుంచి లేచి హడావిడి చేయడం మొదలుపెట్టారు. ఇక పెళ్లి సీన్ రాగానే ఫ్యాన్స్ హంగామా చేయడంతో చైతు వారిని కూర్చోమని చెబుతూ చిరాకుపడ్డాడు. ప్రజెంట్ ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.