Naga Chaitanya – Sobhita.. గత కొన్ని నెలలుగా ఎవరికి తెలియకుండా రహస్యంగా ఎఫైర్ నడిపిన నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ఎట్టకేలకు ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థ వేడుకతో ఒకటి అయ్యారు. సడన్ గా నిశ్చితార్థం ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచిన ఈ జంట ఇప్పుడు కొత్త బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా అక్కినేని నాగచైతన్య – శోభిత నిశ్చితార్థ వేడుకలలో నాగార్జున మాత్రమే కనిపించారు. ముఖ్యంగా నాగార్జున ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. మీరు నిశ్చితార్థాన్ని అఫీషియల్ గా ప్రకటించి.. కొత్త జంటకు ఆహ్వానం పలికారు. అయితే ఈ ఫోటోలలో కేవలం నాగార్జున మాత్రమే కనిపించడంతో అక్కినేని ఫ్యామిలీకి ఈ పెళ్లి ఇష్టం లేదని, అందుకే అమల, అఖిల్ ఈ వేడుకలలో కనిపించలేదు అంటూ రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి..అయితే తాజాగా ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ ఒకే ఫ్రేమ్లో అక్కినేని ఫ్యామిలీ అద్భుతంగా ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రూమర్స్ కి చెక్ ఫ్యామిలీ ఫ్రేమ్ అదుర్స్..
తాజాగా బయటకు వచ్చిన ఫోటోలలో అక్కినేని అమల, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, శోభిత కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.నిన్నటి వరకు నాగచైతన్య శోభిత నిశ్చితార్థానికి అఖిల్ , అమలా రాలేదంటూ రూమర్స్ స్ప్రెడ్ అవ్వడమే కాదు ఏవేవో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఫోటోలు కాస్త బయటకు రావడంతో ఆ రూమర్స్ అన్నిటికి చెక్ పడింది అని చెప్పవచ్చు. అక్కినేని ఫ్యామిలీ శోభితాను తమ ఇంటిలోకి కోడలిగా ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొత్త కోడలితో అక్కినేని ఫ్యామిలీ ఫ్రేమ్ చూడముచ్చటగా ఉందని చెప్పవచ్చు.
దగ్గుబాటి లక్ష్మీ కూడా హాజరు..
ఇకపోతే నాగ చైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మీ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. నాగార్జున దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. నాగచైతన్య పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఇంకొక వివాహం చేసుకొని ఒక కొడుకు కి కూడా జన్మనిచ్చింది. ఇక నాగార్జున కూడా అమలను వివాహం చేసుకొని అఖిల్ కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే నాగచైతన్య – సమంత వివాహ వేడుకల్లో కూడా సందడి చేసిన లక్ష్మి , ఇప్పుడు శోభిత – నాగచైతన్య నిశ్చితార్థ వేడుకల్లో కూడా కనిపించారు. ఇక్కడ నాగచైతన్య , శోభిత తో పాటు నాగచైతన్య తల్లి లక్ష్మి, ఆమె భర్త , వారి కొడుకు కోడలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఫ్యామిలీ ఫోటో కూడా చాలా అందంగా కనిపించిందని చెప్పాలి.
శోభిత ఫ్యామిలీ ఎక్కడ..?
ఇకపోతే నాగార్జున అలాగే దగ్గుబాటి లక్ష్మి ఫ్యామిలీలు ఈ వేడుకల్లో కనిపించారు. మరి శోభిత ఫ్యామిలీ ఎక్కడ అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంకొన్ని గంటలు ఆగితే ఆ ఫోటోలు కూడా బయటకు వస్తాయంటూ అక్కినేని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ఏది ఏమైనా అక్కినేని ఫ్యామిలీ ఈ రూమర్స్ కి చెక్ పెట్టిందని చెప్పవచ్చు.
View this post on Instagram