Allu Arjun vs NagaBabu :మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన సినిమాల్లో కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన ఫ్యామిలీపై ఎవరైనా రూమర్స్ క్రియేట్ చేస్తే మాటలతో తుటాలను పేలుస్తారు. తాజాగా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగా ఫ్యామిలీపై పడి ఏడ్చేవాళ్లకి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండస్ట్రీ ఎవరి అబ్బ, తాత సొత్తు కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మెగా డాటర్ నిహారిక నిర్మాతగా నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం నిర్వహించారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అడవి శేష్ లతోపాటుగా మెగా బ్రదర్ నాగబాబు కూడా గెస్టుగా వచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడిన నాగబాబు సినిమాపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ ఎవరి అబ్బ సొత్తు కాదని, కొందరు మాట్లాడితే మెగా ఫ్యామిలీ అంటూ మాపై ఏడుస్తుంటారు. మెగా ఫ్యామిలీ తప్పా మరెవ్వరూ ఉండరు, అలానే మరికొంత మంది మెగా ఫ్యామిలీ మీద పనికిమాలిని మాటలు మాట్లాడే ఎదవలను చాలా మందిని చూశాం.. సినీ ఇండస్ట్రీ అనేది ఒక మహా సామ్రాజ్యం..
ఇండస్ట్రీ అంటే మా నాన్నది కాదు.. మా తాత ది కాదు.. ఇది చెప్పుకొని కొందరు బ్రతికేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బన్నీనే టార్గెట్ చేశాడా..?
ఈ వ్యాఖ్యలను వింటే ఏదో తేడా కొడుతుందని, కామెంట్స్ వస్తున్నాయి. అల్లు ఫ్యామిలీలోని టార్గెట్ చూస్తూ ముఖ్యంగా అల్లు అర్జున్ ను ఉద్ధేసిస్తూ.. నాగ బాబు ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు కొంత మంది. బాబుగారు అన్న మాటలు అల్లు అర్జున్ కు సెట్ అవుతాయని కొందరు విమర్శకులు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. నిజంగా నాగబాబు బన్నీని ఉద్దేశించి అన్నాడా? లేదా? తెలియదు కానీ ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. చూస్తుంటే మరో వివాడానికి తెరలేపేలా కనిపిస్తుంది. ఇక నిహారిక బ్యానర్ ద్వారా 11 మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అవుతున్నారు. నలుగురు అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 9 న సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమా నిహారికకు ఏ మాత్రం సక్సస్ను అందిస్తుందో చూడాలి. కాగా… అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..