Nagababu : సినిమా ఇండస్ట్రీ మెగాఫ్యామిలీదే కాదు… ఎవరి సొత్తు కాదు – నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Nagababu : టాలీవుడ్ లో ఈ వారం చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అందులో క్రేజీ అంచనాలున్న చిన్న సినిమా “కమిటీ కుర్రోళ్ళు”. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9 వ తేదీన రిలీజ్ కానుంది. ఒక విలేజ్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యాదు వంశీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ప్రోమోలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అలాగే అడివి శేష్ లు గెస్ట్ లుగా హాజరు కాగా, మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. ఇదిలా ఉండగా నాగబాబు ఈ ఈవెంట్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Nagababu sensational comments on the film industry

ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీది కాదు… ఎవ్వరూ సొత్తు కాదు – నాగబాబు

ఇక కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ సందర్భంలో నాగబాబు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ… జనరల్ గా మెగా ఫ్యామిలీ మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ వింటూ ఉంటాం.. వీళ్ళు తప్ప ఇంకెవరూ ఉండరు,.. అలాగే కొంతమంది ఫ్యామిలీస్ మీద కూడా ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడే వారిని చాలా మందిని చూశాం.. మాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు.. “ఈ సినిమా ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీది కాదు.. మా అబ్బ సొత్తు ఏమి కాదు. మా నాన్న సామ్రాజ్యం కాదు. మా తాత సామ్రాజ్యం కాదు.. ఇక అలాగే అక్కినేని ఫ్యామిలీనో, నందమూరి ఫ్యామిలీనో కాదు… ఈ ఇండస్ట్రీ అందరిదీ. టాలెంట్ ఉన్నోళ్లు అందరూ రాణిస్తారు. రీసెంట్ గా అడివి శేష్ లాంటి ఎంతోమంది హీరోలు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాణిస్తున్నారు. వాళ్ళ సొంత టాలెంట్ తో పైకి వచ్చారు అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

ఈ సినిమా ఫినిషింగ్ లో ఒక లీడర్ ని చూస్తారు…

అలాగే కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించి నాగబాబు మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. సినిమా చూశానని చాలా బాగుందని, అయితే, ఈ సినిమాలో ఒక ఫినిషింగ్ టచ్ మాత్రం, ప్రేక్షకులకు ఒక ప్రముఖ నాయకుడ్ని చూసిన ఫీలింగ్ వస్తుందని, అయితే అది ఇప్పటి నాయకుడ్ని కాదు, ఎలక్షన్స్ ముందు యుద్ధం చేసిన ఒక లీడర్ మీకు గుర్తొస్తారని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇక ఎలక్షన్ ముందు అనే సరికి మెగా ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ అని ఫిక్స్ అయిపోయారు. ఇక నాగబాబు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కమిటీ కుర్రోళ్ళు సినిమాకు అయితే అడవి శేష్, సహా మెగా హీరోలు హాజరై సినిమాపై కావాల్సినంత హైప్ తీసుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు