Nagarjuna : నాగ్ దెబ్బకు దారిలోకి వచ్చాడు… ఈ జాగ్రత్త ఏదో ముందే ఉండాల్సింది

Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ వివాదాలు మాత్రం సెలబ్రిటీలను వదిలిపెట్టవు కదా. అలాగే తాజాగా టాలీవుడ్ కింగ్ నాగ్ విమానాశ్రయంలో ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నాగ్ అభిమానిని ఆయన బాడీగార్డ్ తోసేసిన ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూసి నాగ్ దెబ్బకు దారిలోకి వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం పదండి.

నాగ్ దెబ్బకు దారిలోకి..

తాజాగా సోషల్ మీడియాలో నాగార్జునకు సంబంధించిన మరో కొత్త వీడియో వైరల్ అవుతోంది. ఇందులో నాగ్ తన అభిమానులతో ఫోటోలకు ఫోజులిస్తున్నట్టు కన్పిస్తోంది. సదరు వీడియోలో నాగ్ కూల్ గా తన దగ్గరకు వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఆయన బాడీ గార్డ్స్ కూడా నెమ్మదిగా ఒక్కొక్కరిని నాగ్ తో ఫోటోలు దిగడానికి అనుమతిస్తున్నారు. ఈ వీడియోని చూశాక నిన్న ఆయనను దారుణంగా ట్రోల్ చేసిన వాళ్లంతా దెబ్బకు దారిలోకి వచ్చాడు. ఈ జాగ్రత్త ఏదో ముందే ఉండుంటే బాగుండేది. ఇప్పుడు ఇలా డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే అవసరం ఉండేది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ నాగ్ అభిమానులు మాత్రం అనుకోకుండా జరిగిన ఆ విషయానికి నాగార్జునను టార్గెట్ చేసి మాట్లాడారు. నిన్న అనవసరంగా ఆయనను బ్లేమ్ చేసిన వారికి ఈరోజు ఈ వీడియో కనిపించట్లేదా ? అంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా నిన్న ఆ వీడియోను పోస్ట్ చేసిన సదరు వ్యక్తిని ట్యాగ్ చేసి మీ కళ్ళకు ఇది కూడా బాగానే కనిపిస్తుందని ఆశిస్తున్నాము అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Nagarjuna apologizes as his bodyguard roughly pushes his specially-abled fan away at Mumbai airport; Says: 'This shouldn't have happened' – Osullivan Lake Lodge

- Advertisement -

విమానాశ్రయంలో వివాదం…

ఇక అసలు వివాదం విషయానికి వస్తే నిన్న నాగార్జున విమానాశ్రయంలో నడుచుకుంటూ వస్తుండగా ఓ అనుకోని ఘటన జరిగింది. అక్కడ పని చేస్తున్న వృద్ధుడు నాగార్జునతో సెల్ఫీ తీసుకోవడానికి బాడీ గార్డ్స్  ను దాటుకొని సడన్ గా ముందుకు దూసుకొచ్చాడు. దీంతో కంగారుపడిన బాడీగార్డ్ వెంటనే ఆయన్ని పక్కకు పంపించే క్రమంలో చిన్న తోపులాట జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నాగార్జునపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అదంతా తెలుసుకున్న నాగ్ ఎయిర్ పోర్టులో అలా జరగకుండా ఉండాల్సింది అంటూ తన అభిమానికి సారీ కూడా చెప్పారు. అయినా నెటిజెన్లు శాంతించలేదు. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి అయినా నాగార్జున ఎంత కూల్ అనే విషయాన్ని అర్థం చేసుకుంటారా అనేది చూడాలి.

కాగా నాగార్జున చివరి సారిగా నా సామిరంగా మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఎఏ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన నా సామీరంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆయన ధనుష్ తో కలిసి కుబేర అనే సినిమాలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు