Nagarjuna: విడాకుల తర్వాత చైతూ నరకం చూశాడు..!

Nagarjuna.. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 షో కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు కుటుంబ బాధ్యతలు కూడా చేపట్టారు నాగార్జున. అందులో భాగంగానే తన పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్యకు తాజాగా నిశ్చితార్థం జరిపించి, మరొకసారి వార్తల్లో నిలిచారు. నిన్న ఉదయం అనగా ఆగస్టు 8వ తేదీన నాగార్జున.. నాగచైతన్య, ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాల నిశ్చితార్థాన్ని దగ్గరుండి మరీ జరిపించారు. అంతేకాదు ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయనే స్వయంగా షేర్ చేశారు. అయితే ఈ నిశ్చితార్థాన్ని ఇద్దరి జాతకాల ప్రకారం సమయం చూసి మరీ జరిపించినట్లు సమాచారం.

Nagarjuna: Chaitu saw hell after divorce..!
Nagarjuna: Chaitu saw hell after divorce..!

సమంత – నాగచైతన్య విడాకులపై స్పందించిన నాగార్జున..

ఇదిలా ఉండగా.. సమంత ,నాగచైతన్య ఏడేళ్ల పాటు ప్రేమించుకొని, వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. అయితే నాలుగు సంవత్సరాలు మాత్రమే సంతోషంగా ఉన్న వీరు 2021 అక్టోబర్ రెండవ తేదీన విడాకుల ప్రకటించి, అందరిని ఆశ్చర్యపరిచారు. సెలబ్రిటీలు, అభిమానులు వీరి విడాకుల గల కారణాలు తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.. అదే సమయంలో సమంత పై ఎన్నో విమర్శలు కూడా గుప్పించారు. అయితే ఆ సమయంలో ఎవరూ కూడా విడాకులకి గల కారణాలు వెల్లడించలేదు. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ కి నాగార్జున ఇంటర్వ్యూ ఇస్తూ సమంత – నాగచైతన్య విడాకులపై స్పందించారు.

విడాకుల తర్వాత చైతూ ఆ బాధను ఎవరితో పంచుకోలేదు..

నాగార్జున మాట్లాడుతూ.. నాగచైతన్య , సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలా బాధపడ్డారు. చైతూ ఆ బాధను ఇంక ఎవరితోనూ పంచుకోలేదు. తిరిగి సంతోషంగా ఉండడం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాగచైతన్యను మళ్లీ ఇంత ఆనందంగా ఉండడం చూసి.. ఇప్పుడు నా బాద మొత్తం పోయింది అంటూ నాగార్జున తెలిపారు. మొత్తానికైతే సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగచైతన్య చాలా బాధపడ్డారు అంటూ నాగార్జున వెల్లడించారు.

- Advertisement -

శోభిత – నాగచైతన్య పెళ్లికి ఆలస్యం..

శోభిత , నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత అందరూ త్వరలోనే పెళ్లి ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో.. ఈ విషయాలపై కూడా నాగార్జున స్పందించారు. ఇప్పుడే నిశ్చితార్థం జరిగింది కదా.. పెళ్లికి ఇంకాస్త సమయం పడుతుంది. కచ్చితంగా కొంత సమయం తర్వాత వీరి పెళ్లి కూడా జరిపిస్తాము అంటూ తెలిపారు నాగార్జున. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేదా..

ఇకపోతే అక్కినేని నాగచైతన్య, శోభిత నిశ్చితార్థానికి కేవలం నాగార్జున మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో నాగార్జున మాత్రమే కనిపించారు. అఖిల్ , అమల ఎక్కడ కూడా కనిపించలేదు. అసలు ఈవెంట్ కి వచ్చారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన అన్ని ఫోటోలు బయటకు రావాలి అంటే అక్కినేని కుటుంబ సభ్యులు షేర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాగచైతన్య , శోభిత పెళ్లి ఇంకాస్త లేటుగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సమంత నుంచి విడిపోయిన నాగచైతన్య ఇప్పుడు శోభితతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు