Nagarjuna: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగ్ మాజీ భార్య.. ఫోటో వైరల్..!

Nagarjuna..టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న అతి తక్కువ మంది హీరోలలో మన్మధుడు నాగార్జున కూడా ఒకరు. ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే.. అందులో రెండవ భార్య అమల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.. కానీ మొదటి భార్య, నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని చెప్పవచ్చు.. మూవీ మొఘల్ రామానాయుడు కూతురిగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి లక్ష్మితో నాగార్జున ఎందుకు విడిపోయారు అన్న విషయాలు కూడా చాలామందికి తెలియవనే చెప్పాలి.. అయితే తాజాగా మదర్స్ డే సందర్భంగా నాగచైతన్య తన తల్లితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడంతో ఈ వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలో ఆమెను చూసి అభిమానులు సైతం ఫీలవుతున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది దగ్గుబాటి లక్ష్మి.

విభేదాలు రావడానికి అసలు కారణం..

అసలు విషయంలోకి వెళ్తే దగ్గుబాటి లక్ష్మి చిన్ననాటి నుండే అమెరికాలో పెరగడంతో పాటు ఆమె అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో దగ్గుబాటి రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావుల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ వియ్యంకులు కూడా అవ్వాలనుకున్నారు.. అనుకున్నదే తడువుగా నాగార్జున ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వగానే ఆయనకు తన కూతురు లక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు… నిజానికి అమెరికాలోనే పెరిగిన లక్ష్మీ అక్కడే ఉండేందుకు ఇష్టపడేవారు.. కానీ వివాహం కోసం ఆమెను ఇండియాకు రప్పించి చెన్నైలో వీరిద్దరి వివాహం జరిపించగా.. వీరి వివాహ బంధానికి గుర్తుగా నాగచైతన్య జన్మించారు..కొడుకు పుట్టిన తర్వాత ఆమె అమెరికాకు వెళ్ళిపోదామని.. అక్కడే స్థిరపడదామని నాగార్జునతో చెప్పిందట.. కానీ నాగార్జున మాత్రం హీరోగా సినిమాల్లో బిజీ అయ్యారు.. అందుకే అమెరికాకు వెళ్లి సెటిల్ అవ్వడానికి ఆయన ఇష్టపడలేదు మరొకవైపు లక్ష్మీ కూడా ఇండియాలో ఉండడానికి ఇబ్బంది పడింది అలా ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగ్ మాజీ భార్య..

Nagarjuna: Nag's ex-wife who has changed beyond recognition.. Photo viral..!
Nagarjuna: Nag’s ex-wife who has changed beyond recognition.. Photo viral..!

ఇక తర్వాత ఎప్పుడు మీడియా కంటపడలేదు దగ్గుబాటి లక్ష్మి.. కానీ సమంత , నాగచైతన్య వివాహం జరిగినప్పుడు మాత్రమే ఆమె వారి వివాహానికి హాజరైంది. తర్వాత మళ్లీ ఆమె ఎక్కడ కనిపించలేదు.. అయితే ఇప్పుడు నిన్న మదర్స్ డే సందర్భంగా.. నాగచైతన్య తన తల్లి లక్ష్మీతో కలిసి ఒక ఫోటోని షేర్ చేశారు. మదర్స్ డే సందర్భంగా తల్లితో కేక్ కట్ చేయించినట్టు తెలుస్తోంది.ఇక నిన్న దిగిన ఫోటోని ఆయన షేర్ చేసినట్లు తెలుస్తోంది.. తల్లితో నాగచైతన్య దిగిన ఫోటో బాగా వైరల్ అవ్వడం గమనార్హం. అయితే చైతూ షేర్ చేసిన ఫోటోలు చూసి ఆవిడే ఈవిడా.. నమ్మలేకపోతున్నామే …?అంతలా ఎలా ఈమె మారిపోయారు ? అంటూ అభిమానులు, నెటిజెన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఈమె ఇంతలా మారిపోవడానికి గల అసలు కారణం ఏమిటి? అన్నది మాత్రం అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు