Namrata Shirodkar: మహేష్ కండీషన్ – సినిమాలకు దూరం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ అంటే తెలియని వారు ఉండరు. ఘట్టమనేని ఇంటి కోడలుగా కాకుండా నమ్రతకు హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది. 1993 లో మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుని, 1998లో బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది ఈ ముంబై భామ. కొన్ని రోజుల్లోనే బాలీవుడ్ తో పాటు కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేసి సౌత్ లో కూడా ఫేమస్ అయింది.

ఈమె తెలుగులో మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వంశీ అనే సినిమాలో కనిపించింది. ఈ చిత్రం తర్వాత మహేష్, నమ్రత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లింది. 2005లో మహేష్ తో పెళ్లి పీటలెక్కింది. పెళ్లి తర్వాత నమ్రత సీల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంది. తాను వెండి తెరకు దూరంగా ఉండటానికి కారణం ఏంటో తాజాగా నమ్రత వెల్లడించింది.

పెళ్లి తర్వాత మహేష్ పెట్టిన కండీషన్ కారణంగానే తాను సినిమాలు చేయడం లేదని చెప్పింది. నేను పని చేయడం మహేష్ కు ఇష్టం లేదు. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాను. పెళ్లికి ముందు నేను సైన్ చేసిన అన్ని ప్రాజెక్టు లు పూర్తి అయ్యే వరకు మహేష్ వెయిట్ చేశాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాం. అలాగే నేను కూడా మహేష్ కు ఒక కండీషన్ పెట్టాను. ఆ కండీషన్ వల్ల మేము పెద్ద బిల్డింగ్ నుంచి అపార్ట్ మెంట్ కు మారాం అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తాను నటన నుంచి తప్పుకోవడం వల్ల ఎలాంటి బాధ లేదని తెలిపింది. తన తల్లి కోరిక మేరకు మోడలింగ్ కెరీర్ ను ప్రారంభించానని, మహేష కోరికతో దూరమయ్యానని చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు