Nandini Reddy: లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఇంట విషాదం..!

Nandini Reddy..తెలుగులో లేడీ డైరెక్టర్ గా పేరు సంపాదించిన నందిని రెడ్డి ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఎప్పుడూ కూడా విలక్షణమైన సినిమా కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది నందిని రెడ్డి. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈమె.. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.. ముఖ్యంగా తన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనిందని.. గత కొన్ని యేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె సోదరి శాంతి ఇటీవల కన్నుమూశారని.. ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను షేర్ చేసి ఎమోషనల్ గా తెలియజేసింది.

కల్మషం లేని వ్యక్తి అంటూ ఎమోషనల్..

Nandini Reddy: Lady director Nandini Reddy's house tragedy..!
Nandini Reddy: Lady director Nandini Reddy’s house tragedy..!

ఈ వార్త విన్న సెలబ్రిటీలు సైతం నందిని రెడ్డి సోదరి శాంతి ఆత్మకి శాంతి చేకూరాలని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనకు చాలా దగ్గరైన వారిని కోల్పోవడం అంత ఈజీ కాదని.. తనతో కలిసి పెరిగిన వారిలో ఒకరు దూరం కావడం ఇదే మొదటిసారి అంటూ ఈ విషయం తనను చాలా కలవర పెడుతోందని.. మొదటిసారి అక్క అని పిలిచింది శాంతిని మాత్రమే అని, తనకు తెలిసినంతవరకు ఆమె చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అంటూ.. ఎలాంటి కల్మషనం లేని వ్యక్తి అంటూ తెలిపింది. గత నాలుగు నెలలుగా శాంతి ఒక పెద్ద యుద్ధమే చేసింది అంటూ తెలిపింది నందిని రెడ్డి.

నా సోదరి యుద్ధంలో ఓడిపోయింది..

ఆ యుద్ధంలో తన సోదరి ఓడిపోయింది అంటూ ఈరోజు ఆమె మరో లోకానికి వెళ్లిపోయింది అంటూ తెలిపింది. తన జీవితంలోని మర్చిపోలేని వ్యక్తులలో తన సోదరి శాంతి కూడా ఒకరిని. ఆవేదనతో ఒక ఎమోషనల్ స్టోరీ ని రాసుకుంది నందిని రెడ్డి. నందిని రెడ్డి శాంతి ఎలా మరణించిందో మాత్రం ఈ పోస్టులో తెలియజేయలేదు. కానీ ఆమె క్యాన్సర్ తో మరణించారు అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తుంది. ఈ విషయం పైన చాలామంది సెలబ్రిటీలు కూడా పలు రకాలుగా కామెంట్స్ చెబుతూ డైరెక్టర్ నందిని రెడ్డికి ధైర్యాన్ని చెబుతూ ఉన్నారు.

- Advertisement -

నందిని రెడ్డి కెరియర్..

2011లో అలా మొదలైంది అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన నందిని రెడ్డి ఈ సినిమాతో నంది అవార్డును కూడా అందుకుంది.. ఆ తర్వాత జబర్దస్త్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ ,అన్ని మంచి శకునములే తదితర చిత్రాలను తెరకెక్కించింది. అంతేకాకుండా 2013లో వచ్చిన ప్రియతమ నీవచట కుశలమా అనే సినిమాలో కూడా నటించింది. నందిని రెడ్డి సోదరుడు ఉత్తమ్ రెడ్డి కూడా హైదరాబాద్ వంటి ప్రాంతాలలో రాయలసీమ రుచుల పేరుతో రెస్టారెంట్ కూడా నడుపుతున్నారు. వీరి స్వస్థలం కూడా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కావడం గమనార్హం. ఏదేమైనా వరుస చిత్రాలతో విభిన్నమైన కంటెంట్లతో ప్రేక్షకులను అలరించే నందిని రెడ్డి జీవితంలో ఇలాంటి విషాదఛాయలు నిజంగా ఆమెను మరింత కలవరపెడుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే నందిని రెడ్డి సోదరి ఆత్మకు శాంతి చేకూరాలని అటు సెలబ్రిటీలు,ఇటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nandini Reddy (@nandureddyy)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు