Nani: స్టేజ్ పైన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసిన న్యాచురల్ స్టార్ నాని

Nani: నాచురల్ స్టార్ నాని గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్లాప్ అసిస్టెంట్ కెరియర్ ని స్టార్ట్ చేసిన నాని తర్వాత ప్రముఖ దర్శకులు బాపు గారి దగ్గర కొంతకాలం పాటు పనిచేసి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అష్టా చమ్మా అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నటుడుగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. నాని చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ను వసూలు చేశాయి. నాని కెరియర్లో రైడ్, పిల్ల జమిందార్, భీమిలి కబడ్డీ జట్టు అంటే ఎన్నో సినిమాలు అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాయి.

ఇక రీసెంట్ టైమ్స్ లో నాని చేసిన ఫిలిమ్స్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా చాలామంది ప్రేక్షకులకు బాగా నచ్చాయి. జెర్సీ సినిమా తర్వాత నాని చేసిన ప్రతి సినిమా కూడా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు నాని నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం నటుడుగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా నాని అడుగులు వేశాడు. ప్రశాంత్ వర్మ, శైలజ కొలను వంటి దర్శకులకు ఇదివరకే ప్రొడ్యూస్ చేశాడు నాని.

Nani

- Advertisement -

ఇక ప్రస్తుతం నాని వాల్పోస్టర్ బ్యానర్ పై మరో దర్శకుడుని పరిచయం చేయనున్నాడు. ప్రియదర్శి హీరోగా జగదీష్ అనే ఒక కొత్త దర్శకుడు వాల్పోస్టర్ బ్యానర్ పైన కొత్త సినిమాలు చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాని డార్లింగ్ సినిమా ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. ప్రియదర్శి నభా నటేష్ కలిసి నటించిన డార్లింగ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాని చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. నాని గెస్ట్ గా హాజరైనప్పుడు ఎందుకు అని ఎవరికి అర్థం కాలేదు. ప్రియదర్శి తదుపరి సినిమా నాని బ్యానర్ లో చేయడం బట్టే నాని చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడనే ఇప్పుడు క్లారిటీ అందరికీ వచ్చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు