Natasa Stankovic : భారత క్రికెటర్ హర్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ విడాకులపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా నటాషా స్టాంకోవిక్ పూర్తి లగేజ్ తో పాటు తన కొడుకు అగస్త్యతో ఎయిర్పోర్టులో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు విడాకులు తీసుకున్నామంటూ పూర్తి క్లారిటీ ఇచ్చిందని వార్తలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తన కొడుకుతో కలిసి తన సొంత దేశమైన సెర్బియా కి ఈమె వెళ్లినట్లు సమాచారం. ఎయిర్పోర్టులో వీరు దిగిన ఫోటోలే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. 2013 లో బాలీవుడ్ సినిమా సత్యాగ్రహంతో భారత్ లో ఎంట్రీ ఇచ్చిన నటాషా.. బిగ్ బాస్ 8 ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుని.. పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకొని అలా సుమారు 15 పైగా చిత్రాలలో నటించిన నటాషా.. 2020లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.. ఆ సమయం నుంచే సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యాతో వైవాహిక జీవితం గడిపింది.. కానీ ఈ మధ్య అతడితో విభేదాలు వచ్చినట్లు, విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నిజంగానే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కుమారుడితో దేశం వదిలి వెళ్ళిపోయిన నటాషా..
ఒకవైపు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున భారత్ వదిలి తన కుమారుడితో సహా తన సొంత దేశమైన సెర్బియాకు వెళ్ళిపోయింది నటాషా స్టాంకోవిక్. వీరిద్దరూ తెల్లవారుజామున ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫోటోలు, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది మరింత వైరల్ గా మారుతున్నాయి.. నటాషా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా వారు సెర్బియా కి వెళ్తున్న ఫోటోలను ఆమె పంచుకుంది..మొదటి ఫోటోలో నటాషా తన దుస్తులతో ప్యాక్ చేయబడి ఉన్న ఒక సూట్ కేసును చూపించింది.. ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది అంటూ పలు ఎమోజీలను కూడా షేర్ చేసింది.. అలాగే కన్నీళ్ళతో ఉన్న ఎమోజిని షేర్ చేయడమే కాకుండా విమానం, ఇల్లు, లవ్ సింబల్ ను ఆమె షేర్ చేసింది.. అలాగే మరో ఫోటోలో తన పెంపుడు కుక్క ఇమేజ్ ని కూడా పంచుకుంది.
మొత్తానికి విడాకులు అయినట్టేనా..
ఇదిలా ఉండగా గత కొన్ని వారాల నుంచి నటాషా – హార్దిక్ మధ్య విడాకుల పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్ పైన ఎవరూ స్పందించలేదు.. పైగా సోషల్ మీడియా ప్లాట్ఫారంలో కొంతమంది వ్యక్తులు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విడిపోయారని చెబుతున్నారు.. దీనికి కారణం హార్దిక్ భారత క్రికెట్ టీం విజయం సాధించిన తర్వాత వారికి అభినందనలు తెలుపుతూ ఎలాంటి పోస్ట్ పంచుకోలేదు నటాషా. రీసెంట్ గా అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకల్లో కూడా హార్దిక్ మాత్రమే హాజరయ్యాడు.
View this post on Instagram