Nayanatara:ఫస్ట్ టైం అలాంటి రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. కారణం..?

Nayanatara:టాలీవుడ్ , కోలీవుడ్ సినీ పరిశ్రమలో తనదైన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది హీరోయిన్ నయనతార. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి తనదైన ముద్ర సంపాదించుకున్న నయనతార.. ఒకానొక సమయంలో.. చిత్రానికి సైన్ చేసే ముందే కొన్ని కండిషన్ లో పెట్టి ఆ తర్వాత చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండేది.. ముఖ్యంగా ఈమె నటించే ఎలాంటి చిత్రాలకైనా సరే ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొనేది లేదనే విధంగా తెలియజేస్తూ ఉండేది. కానీ తాజాగా నయనతార ఇప్పుడు అలాంటి రూల్స్ ని బ్రేక్ చేసింది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఏంటో ఇప్పుడు చూద్దాం..

Nayanatara: The reason why Nayanatara broke such rules for the first time..?
Nayanatara: The reason why Nayanatara broke such rules for the first time..?

చిరంజీవి, బాలకృష్ణ, షారుక్ ఖాన్ ఎవరైనా రూల్స్ అప్లై..

సాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా సరే సినిమా ప్రమోషన్స్ లో సెలబ్రిటీలే కాకుండా డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్ వంటి వారు పాల్గొంటూ ఉంటారు. అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించిన నయనతార ఇలాంటి నియమాలు అన్నీ కూడా పట్టించుకునేది కాదు. గడిచిన కొన్నేళ్ల క్రితం నుంచే నయనతార ఎలాంటి సినిమా ఈవెంట్స్ కి, ప్రమోషన్స్ కి సైతం పాల్గొనకుండా దూరంగా ఉంటూ ఉండేది. ముఖ్యంగా చిరంజీవి, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలు అయినప్పటికీ ఆమె కండిషన్ ని మాత్రం అప్లై చేస్తూ ఉండేది. అయితే తాజాగా ఈ రూల్ ని బ్రేక్ చేసినట్టుగా తెలుస్తోంది.

అతడి కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార..

తమిళ చిత్రం నేసిప్పయ అనే సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో నయనతార పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. అదితి శంకర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో ప్రమోషన్స్ నీ వేగవంతం చేసింది చిత్ర బృందం..ఈ ప్రమోషన్స్ లో నయనతార పాల్గొనడానికి ఒక ముఖ్య కారణం ఉందట. అదేమిటంటే.. నయనతార విష్ణువర్ధన్ డైరెక్షన్లో వచ్చిన బిల్లా సినిమా నయనతార కెరియర్నే మార్చేసింది. అంతేకాకుండా విష్ణువర్ధన్ కూడా నయనతార కుటుంబ సభ్యుడి లాంటివాడని.. తనమీద అభిమానాన్ని ఇలా ప్రమోషన్స్ రూపంలో చూపించిందట.

- Advertisement -

నయనతార సినిమాలు..

నయనతార సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో జవాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ మహారాజా ఫ్యాన్ మిథిలన్ సామినాథన్ చెప్పిన ఒక లేడీ ఓరియంటెడ్ కథతో సినిమాలో నటించేందుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మహారాజా సినిమా విజయ్ సేతుపతి కెరీర్ లోని మరొక మైలురాయిగా నిలిచింది. మరి అలాంటి డైరక్టర్ డైరెక్షన్లో నయనతార సినిమా వస్తోందని తెలిసి అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికైతే అభిమాన డైరెక్టర్ కోసం తన రూల్స్ ని కూడా బ్రేక్ చేసిన నయనతార ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈమె భర్త ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ కూడా వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ఒకవైపు నిర్మాతగా కూడా బాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే రూల్స్ బ్రేక్ చేసి అభిమానాన్ని చాటుకుంది నయనతార.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు