Nayanthara : షాకింగ్ నిర్ణయం ?

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2003లో మలయాళం చిత్రంతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార.. ఆ తర్వాత సౌత్ లోనే లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందింది. ఇక నయనతార ఈ ఏడాది జూన్ 9వ తేదీన కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ని మహాబలేశ్వరంలో అతిరథ మహారధుల మధ్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

అయితే వివాహం తర్వాత కూడా నయనతార చేతిలో పలు సినిమాలతో తన కెరియర్ చాలా బిజీగా ఉంది. ఇక సరోగసి విధానంలో కవల పిల్లలకు నయనతార – విగ్నేష్ శివన్ జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే నయనతార తన పిల్లల సంరక్షణ కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకుందట.ప్రస్తుతం నయనతార షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తి చేశాక నయనతార మాధవన్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి అంగీకారం తెలిపింది.

వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కొత్త దర్శకుడు శశికాంత్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాలు పూర్తయిన అనంతరం నయనతార కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. ఈనెల 18వ తేదీన నయనతార పుట్టినరోజు వేడుకలను కూడా ఏ హడావిడి లేకుండా జరుపుకోవాలని అనుకుంటుందట. కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చి భర్త, పిల్లలతో గడపాలి అన్నది ఆమె ఆలోచనగా నయనతార సన్నిహితులు చెబుతున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు