Committee Kurrollu PreReleaseEvent : ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి అద్భుతంగా ఉంది – నిహారిక కొణిదెల

Committee Kurrollu Pre Release Event : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో క్రేజీ అంచనాలున్న చిన్న సినిమా “కమిటీ కుర్రోళ్ళు”. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9 వ తేదీన రిలీజ్ కానుంది. ఒక విలేజ్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యాదు వంశీ దర్శకత్వం వహించాడు. ఇక సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ప్రోమోలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అలాగే అడివి శేష్ లు గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో నాగబాబు, హైపర్ ఆది కామెంట్స్ బాగా వైరల్ అవుతుండగా, నిహారిక మెగా ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Niharika Intresting Comments On Mega family At Committee Kurrollu PreReleaseEvent

ఈ ఇయర్ మా ఫ్యామిలికి అద్భుతంగా ఉంది – నిహారిక

కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిహారిక కొణిదెల స్పీచ్ వైరల్ అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డమని సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నామని, అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ లుగా వచ్చిన వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, అడవి శేష్ కి సస్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. ఇక తన స్పీచ్ చివర్లో మెగా ఫ్యామిలీ గురించి చెప్తూ.. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి అద్భుతంగా ఉంది. “మా చరణ్ అన్న సినిమా ఆస్కార్స్ కి వెళ్లింది”… “మా పెదనాన్నకి పద్మవిభూషణ్ వచ్చింది”.. “మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు”.. అలాగే నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను… అదే ఊపులో సినిమా హిట్ చేసెయ్యండ్రా ప్లీజ్ అంటూ ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేసింది. ఇక నిహారిక లాస్ట్ లో చేసిన ఆ కామెంట్స్ మాత్రం ఫ్యాన్స్ కి ఊపు తీసుకొచ్చిందని చెప్పాలి. నెట్టింట నిహారిక చేసిన ఈ వ్యాఖ్యల్ని ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

- Advertisement -

ఆగష్టు 9న రిలీజ్…

ఇక నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఒక విలేజ్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యాదు వంశీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందించగా, ఈ సినిమాలో విలక్షణ నటుడు సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించాడు. ఇక మరి ఈ వారం కమిటీ కుర్రోళ్ళు ప్రేక్షకులను థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు