Nithin: బ‌డ్జెట్ పెరిగిందా ?

నితిన్ హీరోగా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.అతని సొంత బ్యానర్ అయిన ‘శ్రేష్ట్ మూవీస్‌’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సొంత బ్యానర్లో నితిన్ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. ‘ఇష్క్’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి హిట్లతో పాటు ‘మాస్ట్రో’ వంటి యావరేజ్ సినిమాలు కూడా ఈ బ్యానర్ నుండీ వచ్చాయి.నితిన్ తన సొంత బ్యానర్ లో చేసే సినిమాల బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అనిపించుకున్న ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం కూడా లాభాలు మిగిల్చింది అంటే ఆ చిత్రం బడ్జెట్ ను అదుపులో పెట్టుకోవడం వలనే అని గతంలో చాలా వార్తలు వచ్చాయి.

అయితే ‘మాచర్ల… ‘ విషయంలో మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. మొదట అనుకొన్న బ‌డ్జెట్ ఒకటి.. సినిమా పూర్తయ్యాక అయిన బడ్జెట్ మరొకటి అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 30 శాతం ఖ‌ర్చు పెరిగిపోయింది. ద‌ర్శ‌కుడికి ఇదే మొదటి సినిమా కావడంతో మేకింగ్ స‌మ‌స్య‌లు, అలాగే రీషూట్లు వంటివి చేయ‌డం వ‌ల్ల ఇలా బ‌డ్జెట్ పెరిగినట్టు తెలుస్తుంది.ఇప్పుడు ఆ బడ్జెట్ కు తగినట్లు బిజినెస్ అవుతుందా? లేదా? అని నిర్మాతలు కంగారు పడుతున్నారు అని వినికిడి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు