Nivetha Thomas : పెళ్లయ్యింది, ఇద్దరు పిల్లలు కూడా… షాకింగ్ విషయాన్ని బయట పెట్టిన నివేదా

Nivetha Thomas : తెలుగులో నాని, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ నివేదా థామస్ తాజాగా తనకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్న షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. అంతేకాకుండా తన ఫ్యామిలీని ఓ వేదికపై ఆమె పరిచయం చేయడం చర్చకు దారి తీసింది. మరి ఇంతకీ నివేదా పెళ్లి ఎప్పుడు అయింది? ఆమెకు ఇద్దరు పిల్లలు ఎప్పుడు పుట్టారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే….

రెండేళ్ల గ్యాప్ తరువాత రీఎంట్రీ

చివరగా తెలుగులో శాకిని డాకిని అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చేసిన నివేద థామస్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. పెద్దగా అవకాశాలు రాక ఏకంగా రెండేళ్ల పాటు టాలీవుడ్ కు దూరంగా ఉంది. అయితే రీసెంట్ గా గుడ్ న్యూస్ అంటూ ఆమె చేసిన ఓ ట్వీట్ చర్చకు దారి తీసింది. సినిమా అవకాశాలు తగ్గాయి కాబట్టి ఆమె పెళ్లి చేసుకోబోతోంది అనే రూమర్ వైరల్ అయింది. అయితే కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఫైనల్లీ అంటూ బ్యూటీ తన రీఎంట్రీ గురించి ట్వీట్ చేసి ట్విస్ట్ ఇచ్చింది. తను చేసిన ట్వీట్ 35 చిన్న కథ కాదు అనే సినిమా గురించి. ఈ సినిమాలోనే నివేదా ఇంత గ్యాప్ తర్వాత హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి సినిమా ప్రకటించిన ఈ బ్యూటీ తాజాగా ఇదే వేదికపై తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని వెల్లడించింది. తాజాగా రానా దగ్గుబాటి ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేశారు. అయితే ఇదే వేదికపై హీరోయిన్ నివేదా మూవీ అప్డేట్ గురించి తాను మొదట చేసిన ట్వీట్ పెళ్లి చర్చకు ఎలా దారి తీసిందో ప్రస్తావించింది.

Nivetha Thomas To Star In Garividi Pedda Laxmi's Telugu Biopic | Times Now

- Advertisement -

పెళ్లి వార్తలు విని షాక్ అయ్యా…

తన ఫస్ట్ ట్వీట్ చూసాక చాలామంది నివేదాకు పెళ్లి అంటూ ఆర్టికల్స్ రాశారని గుర్తు చేసింది. అయితే వాటిని తన తల్లి తనకు పంపించడంతో ఈ హీరోయిన్ కూడా షాక్ అయ్యిందట. అవునా మీరు నాకు ఎప్పుడూ అబ్బాయిని చూసారు అని తల్లిని ఫన్నీగా ప్రశ్నించిందట. ఇక ఇప్పుడు 35 చిన్న కథ కాదు అనే మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో తన ఫ్యామిలీని పరిచయం చేసింది. ఇప్పుడు చెబుతున్నాను ఇతనే నా భర్త అంటూ హీరో విశ్వదేవ్ ను చూపించింది. అలాగే వీళ్ళిద్దరూ నా కొడుకులు అరుణ్, వరుణ్ అంటూ పేర్లతో సహా చెప్పుకొచ్చింది. అయితే నిజానికి నివేదా చెప్పింది సినిమా గురించే అయినప్పటికీ ఈ వార్తలు వైరల్ గా మారాయి. ఇదే విషయాన్ని ఆమె దృష్టికి ఫిలిం జర్నలిస్టులు తీసుకెళ్లగా సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇలాగే ప్రచారం చేసినా తనకేం అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది. కాగా ఈ మూవీ ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది. నందకిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు