Nkr21: ఎన్టీఆర్ ఆర్ట్స్ లో 21వ సినిమా ను అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్

Nkr21: బాల నటుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తొలిచూపులోనే సినిమాతో హీరోగా రియంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత చేసిన అభిమన్యు సినిమా కూడా పెద్దగా గుర్తింపును తీసుకుని రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకుడుగా పరిచయమైన అతనొక్కడే సినిమాతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాతో నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఇప్పటికీ పలు సినిమాలు నిర్మిస్తూ వచ్చాడు కళ్యాణ్ రామ్.

అతనొక్కడే సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ కెరియర్ లో ముందుకెళ్లాడు కానీ ఆ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఒక సందర్భంలో నిర్మాతగా కూడా వరుస డిజాస్టర్ సినిమాలను చూశాడు. అయితే అనిల్ రావిపూడి దర్శకుడుగా పరిచయమైన పటాస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుని నిర్మాతగా కూడా మంచి కలెక్షన్స్ను వసూలు చేసుకున్నాడు ఈ సినిమా తర్వాత మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చాడు కళ్యాణ్ రామ్. అలానే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన నిజం సినిమా కూడా నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.

Nkr21: Kalyan Ram announced the 21st movie in NTR Arts

- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా చేసిన జై లవకుశ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ కి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు కనిపిస్తాడు. దర్శకుడుగా పరిచయ మైన బింబిసారా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్లీ వరుస సినిమాలు చేయటం మొదలుపెట్టాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు దాని కెరియర్లు 20 సినిమాలను పూర్తి చేశాడు. ఇప్పుడు 21వ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే చేయనున్నాడు. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే నారా రోహిత్ రాజా చెయ్యివేస్తే అనే సినిమాను డైరెక్ట్ చేశాడు ప్రదీప్. కళ్యాణ్ రామ్ 21వ సినిమా ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటుంది అని అధికారికంగా ప్రకటించి ఒక వీడియోను రిలీజ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు