HBD Janhvi Kapoor ఎన్టీఆర్ తోనే టాలీవుడ్ లో తొలి ప్రయత్నం..ఎందుకంటే..?

టాలీవుడ్ లో అతిలోకసుందరిగా పేరు పొందిన హీరోయిన్ శ్రీదేవి.. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది.. బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. వీరికి ఇద్దరు కుమార్తెలు.. అందులో ఒకరు జాన్వీ కపూర్ కాగా మరొకరు ఖుషీ కపూర్.. శ్రీదేవి ఒక హోటల్లో ప్రమాదవశాత్తు మరణించడంతో శ్రీదేవి నట వారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.. ఇక టాలీవుడ్ లోకి కూడా ఇటీవల ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఈ రోజున జాన్వీ కపూర్ 27వ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

తెలుగులో తొలి ప్రయత్నం..
ముఖ్యంగా టాలీవుడ్ లోకి ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ తోనే ఎంట్రీ ఇస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మనవడు తారక్ , శ్రీదేవి కుమార్తె జాన్వీ జోడిగా సినిమా రాబోతోందని తెలిసి అభిమానులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు..

ఆమె కోసమే..
జాన్వీ, ఎన్టీఆర్ తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం ఆమె తల్లి శ్రీదేవేనట.. అయితే శ్రీదేవి చనిపోక ముందు ఒక సందర్భంలో ఎన్టీఆర్ తో కలిసి శ్రీదేవి మాట్లాడిందట..తన కూతుర్ని తెలుగు తెరకు పరిచయం చేయడం.. అది నీ సినిమాతోనే మొదలుకావాలని కోరిందట.. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా శ్రీదేవి చనిపోయిన తర్వాతే వెల్లడించారు.. ముఖ్యంగా మీ తాత, నేను కలిసి ఎన్నో చిత్రాలలో నటించాము.. మా ఇద్దరికీ మంచి జోడి అని ప్రేక్షకాదరణ కూడా ఉంది.. అలాగే మీ జోడికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె తెలియజేసిందట..

- Advertisement -

మాట నిలబెట్టుకున్న ఎన్టీఆర్..
అలా అప్పుడు శ్రీదేవి చెప్పిన మాటలను తన కూతురు జాన్వీ కపూర్ కూడా చెబుతూ ఉండేదట.. అలా గుర్తుపెట్టుకుని ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడం.. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కూడా చాలా భిన్నంగా ఉండడంతో వెంటనే ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పేసిందట. అంతేకాకుండా తన తల్లి కన్న కల కూడా ఈ సినిమాతో నెరవేరబోతోందనీ చెప్పవచ్చు.. అందుకే ఎన్టీఆర్ తోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ సరైన సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోతోంది.

ఎన్టీఆర్ సినిమాలు..
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు