NTR Heroine: పెగ్గు వేయనిదే ..నిద్రపోనంటున్న ఎన్టీఆర్ హీరోయిన్..!

NTR Heroine.. టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితులు అయిన హీరోయిన్లలో హీరోయిన్ పాయల్ ఘోష్ కూడా ఒకరు.. ఈ అమ్మడు తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి, మాస్కేల్ తదితర చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా హిందీ తదితర చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. మీటూ ఉద్యమం ద్వారా బాలీవుడ్ లో కూడా ఈమె పేరు మరింత వైరల్ గా మారింది.. అలాగే ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్ వంటి వారు వెంటపడే వారంటూ ఆరోపించింది.

NTR Heroine: NTR Heroine who doesn't want to sleep..!
NTR Heroine: NTR Heroine who doesn’t want to sleep..!

అనురాగ్ కశ్యప్ పై ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేయడానికి చూశారంటూ కూడా పలు రకాల ఆరోపణలు చేయడంతో బాలీవుడ్లో ఈమెకు అవకాశాలు రావడంలేదనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన జీవితంలో ఎదురైనా కొన్ని విషయాలను తెలిపింది.. నటుడు అక్షయ్ కుమార్ తనను ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని కూడా తెలియజేసింది.. ఇర్ఫాన్ పఠాన్ తో ఐదు సంవత్సరాలపాటు డేటింగ్ లో ఉన్నాను.. ఆ తర్వాత విడిపోవలసి వచ్చింది అంటూ తెలిపింది. తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే ఇర్ఫాన్ పఠాన్ కు చెప్పేదాన్ని అని.. తెలియజేసింది.

అనురాగ్ కశ్యప్ దారుణంగా వేధించాడు..

ఇర్ఫాన్ పఠాన్ నుంచి విడిపోయిన తర్వాత తనకు అనారోగ్య సమస్యలు వచ్చాయని.. చాలా సంవత్సరాలు ఎలాంటి పని చేయలేకపోయాను కానీ తాను ప్రేమించిన వ్యక్తులలో కేవలం ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే ఉంటారు అంటూ తెలిపింది. ఆ తర్వాత మరెవరిని కూడా తను ప్రేమించలేదని తెలిపింది పాయల్. 2014లో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన ముందు బట్టలు విప్పి తనని చాలా వేధించారని కూడా తెలియజేసింది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలనే కాకుండా ఇండస్ట్రీలో జరిగే విషయాల పైన ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది పాయల్ ఘోష్.

- Advertisement -

బాధ తట్టుకోలేక మందుకు బానిసయ్యా..

ఇప్పుడు తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పాయల్ ఘోష్ తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి తెలియజేస్తూ.. నిద్ర మాత్రలు ఎక్కువగా మింగే దానినని.. అలాగే ఒక గ్లాస్ వైన్ కూడా తాగనిదే తనకు ఇప్పటికీ కూడా నిద్ర పట్టడం లేదంటూ తెలియజేసింది పాయల్. అనురాగ్ కశ్యప్ తనను హత్యాచారం చేశాడని.. చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని కూడా తెలియజేసింది.. గత కొన్నేళ్లుగా యాంటీ డిప్రెసెంట్ మందులు కూడా ఉపయోగిస్తున్నారని తెలియజేసింది. అనురాగ్ కశ్యప్ కి ఒక కూతురు కూడా ఉన్నది .. తను కూడా తనలాగే అత్యాచారానికి గురవుతుందని కూడా ఆమె ఈ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ ఘోష్ రాసుకొచ్చిన ఈ ఇంస్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. మరి ఈ విషయాల పైన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Paayel Ghosh (@iampayalghosh)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు