NTR: గుర్తుపెట్టుకుని మరీ అలాంటి సాయం.. ఫ్యాన్స్ ఖుషీ..!

NTR.. అభిమానులకు, సిని సెలబ్రిటీలకు విడదీయరాని బంధం ఉన్నది. ఈ విషయం ఎన్నో సందర్భాలలో నిరూపించారు కూడా. స్టార్ హీరోలు సైతం ఎక్కువగా అభిమానులకు ఎన్నో రకాల సూచనలు ఇస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఈయన ఫ్యాన్ బేస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించినప్పటికీ అభిమానులలో ఎప్పుడూ ఒక హీరో గానే చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నోసార్లు తన మంచి మనసుని చాటుకున్న సందర్భాలు ఉన్నాయి.

NTR: Remember, such a help.. Fans Khushi..!
NTR: Remember, such a help.. Fans Khushi..!

బాద్ షా ఆడియో ఫంక్షన్ లో అభిమాని మృతి..

ఎలాంటి ఆడియో ఫంక్షన్ జరిగినా, ఈవెంట్ జరిగినా కూడా ఖచ్చితంగా చివరిలో అభిమానులను ఉద్దేశించి.. ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను గుర్తు పెట్టుకొని రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని సినిమాలలో, థియేటర్లలో కూడా ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ 2013లో బాద్షా సినిమా లాంచింగ్ కార్యక్రమం జరగగా, అక్కడికి భారీగా అభిమానులు తరలిరావడం జరిగింది. ఆ జనాల మధ్య గుంపులో ఏం జరుగుతోందని విషయం కూడా గుర్తించలేనంతగా అక్కడ అభిమానులు రావడంతో పాటు తొక్కిసలాట కూడా జరిగిన సంఘటన అందరిని కుదిపేసింది.

11 ఏళ్లుగా అభిమాని కుటుంబానికి సాయం..

దీంతో ఎన్టీఆర్ అభిమాని అయిన రాజేంద్రప్రసాద్ ఒకరు మృతి చెందారు. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ ని సైతం చాలా అసంతృప్తికి గురిచేసిందని కూడా చెప్పారు. అంతేకాకుండా తన మంచి మనసుతో ఎన్టీఆర్ బాధిత కుటుంబాన్ని కూడా కలవడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటానని కూడా అప్పుడు మాట ఇవ్వడంతో పాటు 11 ఏళ్లుగా ఆ కుటుంబాన్ని సైతం ఆదుకుంటూ తన గొప్ప మనసుని చాటుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ కూడా తన అభిమాన కుటుంబాలను తానే చూసుకుంటూ ఉంటున్నారట.

- Advertisement -

అభిమాని కుటుంబానికి అండగా ఎన్టీఆర్..

అంతేకాకుండా ఆ సంఘన జరిగిన తర్వాత బండ్ల గణేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు అందించడం జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికీ రాజేంద్రప్రసాద్ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడనే విషయం అభిమానులకు తెలియడంతో అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. నిజమైన హీరో అంటే మీరే అన్న మీలాంటి వారికి అభిమానిగా ఉండడం మా అదృష్టమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ గొప్ప మనసుకి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే.

ఎన్టీఆర్ సినిమాలు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తూ ఉండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు