Varsham : 20 ఏళ్ల సందర్భంగా..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలను థియేటర్ లలో మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. హీరోల పుట్టిన రోజులను పురస్కరించుకుని సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేయడం ఒక ఆనవాయితీగా అయిపోయింది. రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే సినిమాను కూడా రిలీజ్ చేసారు.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకరి, పవన్ కళ్యాణ్ నటించిన జల్సా తో పాటు ఇటీవల నందమూరి నటసింహం డ్యూయల్ రోల్ చేసిన చెన్నకేశవరెడ్డి చిత్రాలను రీ రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ చిత్రాలకు ఊహించని స్థాయిలో స్పందన వచ్చిన విషయం విధితమే.

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమా వర్షం సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈశ్వర్ సినిమాతో తన కెరీర్ ను ఆరంభించిన ప్రభాస్ ఈ నెల 11 నాటికి కరెక్ట్ గా 20 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా “వర్షం” సినిమాను తమ నట్టీస్ ఎంటర్ టైన్ మెంట్స్ తరపున రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తెలియజేశారు. ఇప్పటికే ఆన్ లైన్ లో  టిక్కెట్ల బుకింగ్ మొదలయ్యిందని, స్పీడ్ గా టిక్కెట్లు బుక్ అవుతూ, విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు