Guppedantha Manasu : సీరియల్ నుంచి ఔట్… కారణం బయట పెట్టిన రిషి

Guppedantha Manasu :”గుప్పెడంత మనసు” సీరియల్ తెలుగు వీక్షకులను ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హౌస్ వైఫ్స్ అంతా ఇంటి పనులను పక్కనపెట్టి సైతం ఈ సీరియల్ చూడడానికి సమయానికి టీవీ ముందు కూర్చుంటూ ఉంటారు. దీంతో ఈ సీరియల్ లో నటించే నటీనటులకు వెండితెరపై స్టార్స్ కు ఉండేటంత క్రేజ్ వచ్చేస్తోంది. అయితే రిషి పాత్రలో నటించిన ముఖేష్ గౌడ కొన్ని రోజుల నుంచి ఈ సీరియల్ లో కనిపించడం లేదు. దీంతో ముఖేష్ గౌడను ఈ సీరియల్ నుంచి తీసేసారని కొంతమంది బుల్లితెర ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా ముఖేష్ ఆ సీరియల్ లో కనిపించకపోవడానికి కారణం ఏంటో మరో నటుడు వెల్లడించాడు.

మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన ముఖేష్ గౌడ పలు సీరియల్స్ లో హీరోగా నటిస్తూ బుల్లితెరపై హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక “గుప్పెడంత మనసు” అనే టైటిల్ తో తెలుగులో ప్రసారం అవుతున్న డైలీ సీరియల్ తో ముఖేష్ కు మంచి క్రేజ్ దక్కింది. “గుప్పెడంత మనసు” సీరియల్ కు ఆడియన్స్ వేరే లెవెల్ లో కనెక్ట్ అవుతున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ప్రేమ కథకు, కుటుంబ సంబంధాలను, వారి మధ్య ఉండే భావోద్వేగ అంశాలను కలగలిపి ఆసక్తికరంగా ఈ సీరియల్ ను ప్రసారం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే కొన్నాళ్లుగా ఈ సీరియల్ లో రిషి పాత్రలో నటిస్తున్న ముఖేష్ గౌడ కనిపించడం లేదు. శైలేంద్ర రిషిని కిడ్నాప్ చేశాడు అంటూ స్టోరీని నడిపిస్తున్నారే తప్ప అసలు రిషిని మాత్రం చూపించడం లేదు. దీంతో రిషిని సీరియల్ ప్రకారం నిజంగానే కిడ్నాప్ చేశారా? లేదంటే మొత్తానికే ఆయన్ను సీరియల్ నుంచి తొలగించారా అని బుల్లితెర ప్రేక్షకులు టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా సీరియల్ లో మహేంద్ర భూషణ్ పాత్రలో నటిస్తున్న సాయికిరణ్ క్లారిటీ ఇచ్చాడు.

ముఖేష్ ఇటీవల జిమ్ లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడని తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలవడంతో ముఖేష్ కు డాక్టర్స్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారట. అందుకని ముఖేష్ షూటింగ్ కు రాలేకపోవడంతో కిడ్నాప్ డ్రామాను రంగంలోకి దించారు సీరియల్ నిర్వాహకులు. ఇక త్వరలోనే ముఖేష్ సీరియల్ లో జాయిన్ అవుతాడు అని క్లారిటీ ఇచ్చాడు సాయికిరణ్.

- Advertisement -

ఇదిలా ఉండగా ముఖేష్ హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ముఖేష్ గౌడ, ప్రియాంక శర్మ జంటగా ఓ కొత్త మూవీ రూపొందుతోంది. “గీత శంకరం” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీకి కొత్త దర్శకుడు రుద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళికి ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. కాగా ఈ సీరియల్ తో జగతి మేడంగా జ్యోతి రాయ్ ఎంతటి ఫ్యాన్ బేస్ ను పెంచుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె కూడా ఈ సీరియల్ లో చనిపోయి తన క్యారెక్టర్ కు చెక్ పెట్టేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన కొత్త అవతారాన్ని బయటపెట్టి వెబ్ సిరీస్, సినిమాలతో బిజీ అయింది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు