Pallavi Prashanth.. బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి పరిచయాలు అవసరం లేదు.. ఇప్పటికే 7 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కి సిద్ధం అవుతుంది. ఇదిలా ఉండగా సీజన్ 7 లో కామన్ మ్యాన్ కాటగిరీలో అడుగుపెట్టి… తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను కట్టిపడేసి టైటిల్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్.. అప్పట్లో టైటిల్ గెలుచుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.. ఇకపోతే ఈ సీజన్ 7 పూర్తయి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ఈ సీజన్ కు సంబంధించిన విషయాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 7..
ముఖ్యంగా ఈ సీజన్లో అమర్ దీప్ , శివాజీ , ప్రియాంక , రతిక , శోభా శెట్టి, అర్జున్, షకీలా, టేస్టీ తేజ లాంటి వారు ప్రధాన కంటెస్టెంట్ లుగా పాల్గొన్నారు.. ఇక పల్లవి ప్రశాంత్.. శివాజీ అండదండలతో తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించాడు.. రతిక తో రొమాన్స్ చేసిన ఇతడు బాగా పబ్లిసిటీ దక్కించుకున్నాడు.. ఊహించని కంటెస్టెంట్స్ కొంతమంది ఫైనల్ టాప్ ఫైవ్ వరకు చేరడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ముఖ్యంగా టాప్ ఫైవ్ లో ఉంటారనుకున్నవారు ముందుగానే ఎలిమినేట్ అయిపోయారు.. ముఖ్యంగా వారిలో ప్రధానంగా చెప్పాల్సింది షకీలా. ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన ఈమె త్వరగానే ఎలిమినేట్ అయిపోయింది..
సీజన్ సెవెన్ లో వారే నిజాయితీపరులు..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా మాట్లాడుతూ తన ఎలిమినేషన్ గురించి అలాగే పల్లవి ప్రశాంత్ , నాగార్జున, శివాజీ గురించి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..షకీలా మాట్లాడుతూ.. హౌస్ లో నేను ఉన్నప్పుడు.. నాకు ప్రియాంక, అమర్ దీప్ , దామిని , సందీప్ మాత్రమే నిజాయితీ పరులుగా అనిపించారు.. వారిలో నాకు ఎలాంటి తప్పులు కనిపించలేదు.. ముఖ్యంగా వాళ్లలో నేను నిజాయితీ చూసాను.. శివాజీ అయితే న్యూట్రల్ పర్సన్… ఆయన నిజాయితీ. పరుడా కాదా అనేది నేను చెప్పను.. కానీ వీక్ గా అనిపించిన కంటెస్టెంట్స్ కి మాత్రం ఆయన కచ్చితంగా సపోర్ట్ చేశాడు..
పల్లవి ప్రశాంత్ కి ఆటిట్యూడ్ ఎక్కువ..
ఇక పల్లవి ప్రశాంత్ గురించి యాంకర్ అడగ్గా..అతడి ఫ్యాన్స్ ఏం చేసినా పర్లేదు.. ఐ డోంట్ కేర్ ఎందుకంటే అతడు హౌస్ లోకి పిల్లి లాగా వచ్చి.. బిగినింగ్లో పిల్లిగా బిహేవ్ చేశాడు.. వినయం నటించాడు.. ఆ తర్వాత కాస్త గుర్తింపు రాగానే తన ముందు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారన్నది కూడా చూడకుండా… కళ్ళు నెత్తికెక్కాయి . యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది.. సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు.. సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుంటూ ఆటిట్యూడ్ చూపించాడు ..అది నాకు నచ్చలేదు.. అది అతడి నిజస్వరూపం అంటూ తెలిపింది..
బిగ్ బాస్ నాగార్జునకు తప్ప ఎవరికి ఉపయోగం లేదు..
బిగ్ బాస్ లోకి పబ్లిసిటీ కోసమే తమను తీసుకున్నారు.. వాళ్ళ అవసరం తీరిపోయాక నన్ను పంపించేశారు.. ఇక నాగార్జునకు తప్ప బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షకీలా.