Nivetha Pethuraj : పోలీసులతో “పరువు” కోసం గొడవ.. ఇది అసలు మ్యాటర్..

Nivetha Pethuraj : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరైన నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చెన్నై నుండి వచ్చిన ఈ సుందరి “మెంటల్ మదిలో” అనే చిన్న చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలలో నటించినా ఆమెకు పెద్దగా సక్సెస్ లు లభించలేదు. మధ్యలో బ్రోచేవారెవరురా, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నా పెద్దగా ఉపయోగపడలేదు. అయితే ఏడాదిన్నర గా నివేదా సినిమాల్లో నటించలేదు. ఓ తమిళ్ సినిమాలో నటించింది. తెలుగులో కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ మంచి కంటెంట్ ఉంటే తప్ప చేయకూడదని డిసైడ్ అయ్యింది. అయితే సినిమాల్లో కనిపించకపోయేసరికి నివేదా వేరే ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయిందనుకున్నారు అంతా. కానీ సడన్ గా ఒక వీడియోతో నెట్టింట్లో వైరల్ అయి హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ వీడియోలో, ఆమె కారు డిక్కీని చెక్ చేయాలని కోరిన పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

Paruvu makers gave clarity about Nivetha Pethuraj clash with the police

పరువు పోతుందని గొడవ..

అయితే నివేదా కారు కూడా దిగకుండా తన కారు ద్వారా వాళ్ళకి ఏ సమస్య లేదని, తన కారు డిక్కీలో ఏమీలేవని, తన దగ్గర అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నాయని నివేదా అంటుంది. అర్ధం చేసుకోండి పరువు పోతుంది అని కూడా అంటుంది. అయితే, పోలీసులు వినకుండా డిక్కీ తెరవాలని పట్టుబట్టారు. ఇక ఆమె టెన్షన్ పడుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. అయితే వీడియోలో, పోలీస్ ఒకరు ఈ ఘటనను వీడియో తీస్తుండగా, నివేదా (Nivetha Pethuraj) ఆ ఫోన్ ను లాగేసుకోవడం కూడా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు డిక్కీలో ఏముందో అని తెగ ఆసక్తిగా చర్చలు మొదలుపెట్టారు. అసలు ఇది నిజమేనా అని మరికొందరు కామెంట్ చేశారు. అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియకపోయినా, తాజాగా ఈ వీడియో గురించి అసలు విషయం తెలిసింది.

- Advertisement -

అసలు మ్యాటర్ ఇది..!

అయితే తాజాగా వైరల్ అయిన నివేదా (Nivetha Pethuraj) కార్ వీడియో నిజానికి నివేదా పేతురాజ్ కొత్త సినిమా ప్రమోషన్ లో భాగమని తేలింది. జీ 5 ఓటిటి లో స్ట్రీమింగ్ కానున్న “పరువు” అనే వెబ్ సీరీస్ ప్రమోషన్స్ కోసం ఈ వీడియో విడుదలైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అది నిజం కాదని తేలిపోయింది. “పరువు” ప్రాజెక్టు జూన్ 14న విడుదల కానున్న నేపధ్యంలో, ఈ పబ్లిసిటీ స్టంట్ ద్వారా సినిమాపై మరింత ఆసక్తిని పెంచాలని ప్రయత్నించారు. నివేదా పేతురాజ్ ఇలాంటివి తన సినిమాలకు ప్రమోషన్ చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఆమె డిఫరెంట్ ప్రమోషన్స్ స్ట్రాటజీ తో సినిమాలపై ఆసక్తిని పెంచింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, “పరువు” ఒరిజినల్ సీరీస్ పై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇలా, టాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న నివేదా పేతురాజ్, కొత్త సినిమాలతో మరింత ప్రేక్షకులను అలరించేందుకు సిద్దంగా ఉంది. ఇక “పరువు” సీరీస్ సక్సెస్ తో ఆమె కెరీర్ లో మరొక మైలురాయిని చేరుకుంటుందేమో చూడాలి. ఇక ఆ మధ్య విశ్వక్ సేన్, నిఖిల్, విజయ్ దేవరకొండ సైతం ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేసి తమ సినిమాలకు ప్రమోషన్లు చేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు