Pawan Kalyan : OG అనే తుఫాన్ వచ్చి ఏడాది అయింది… ఇంకా తీరాన్ని తాకలేదు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రీయంట్రీ తర్వాత వరుస సినిమాలను సైన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) ఇన్వాల్వ్ అయి ఉన్న అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సాధించాయి. వకీల్ సాబ్(Vakeelsaab), భీమ్లా నాయక్(Bheemla Nayak), బ్రో(Bro) సినిమాలు పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతృప్తిని ఇచ్చాయి. కానీ పూర్తిస్థాయిలో సూపర్ హిట్ ఫిలిమ్ అంటూ ఇప్పటికి కూడా రాలేదు అని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు.

చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా అంటే ఓజి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ఫ్యాన్ బాయ్ సుజిత్(Sujeeth) దర్శకత్వం వహిస్తున్నాడు. సుజిత్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ఏజ్ లోనే షార్ట్ ఫిలిమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని రన్ రాజా రాణి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. సుజిత్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి సుజీత్ ను ఒక దర్శకుడుగా నిలబెట్టింది.

Pawan Kalyan

- Advertisement -

ఇకపోతే ఓజి సినిమాకు సంబంధించి ఇదివరకే ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం చాలామందిని ఆకట్టుగా ఉంది. ఇప్పటివరకు రీమేక్ సినిమాలు చూసి అలసిపోయిన పవన్ అభిమానులకు ఈ ఓజి టీజర్ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇకపోతే ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సినిమా రావట్లేదు. ఇకపోతే నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీని కారణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు. ఇదే విషయాన్ని డి వి ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా తెలిపింది. ఇకపోతే ఒక ఏడాది బ్యాక్ వచ్చిన గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానిని ఉద్దేశిస్తూ తుఫాను వచ్చి ఏడాది అయింది కానీ ఇంకా తీరాన్ని తాకలేదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే గ్లిమ్స్ వచ్చి ఏడాది పూర్తి దాటినా కూడా సినిమా ఇంకా రిలీజ్ కాలేదని వాళ్ళ ఉద్దేశ్యం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు