Khushi: 2 దశాబ్దాలు దాటినా అదే పవర్

ఖుషి సినిమాలో ‘సిద్ధూ సిద్ధార్థ రాయ్….’ అంటూ తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టాడు పవన్ కళ్యాణ్. చేసింది రీమేక్ సినిమానే అయినప్పటికీ తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ తగ్గలేదు. టీవీ లో వచ్చిన ప్రతి సారి మంచి TRPలను తెచ్చి పెడుతుంది. 2023 ఏప్రిల్ నాటికి ‘ఖుషి’ సినిమా రిలీజ్ అయి 21సంవత్సరాలు పూర్తి కానుంది. అయినా ఈ సినిమాకి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. పవన్ కళ్యాణ్ వేసే ఓపెన్ షర్ట్ అండ్ హుడి ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

తమిళ్ లో ఎస్. జె దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా, జ్యోతిక హీరోయిన్ గా 2000 సంవత్సరంలో తమిళ్ ఖుషి సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. అదే సినిమాని కొన్ని మార్పులు చేసి S. J. సూర్య తెలుగు లో 2001లో పవన్ కళ్యాణ్ హీరోగా విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ కి జంటగా భూమిక నటించారు.వీరిద్దరి మధ్య కేమిస్ట్రీ గురంచి చెప్పాల్సిన పని లేదు. వీరి మధ్య జరిగే కొని సీన్స్ ఇంకా ట్రెండ్ సెట్ చేస్తూనే ఉన్నాయ్. మణిశర్మ అందించిన పాటలు ఈ తరం పిల్లలకి కూడా మెస్మరైజింగ్ గా అనిపిస్తాయి. ప్రతి పాటకి ఫాన్స్ ఉన్నారు. ‘ఏ మే రాజహా’ అంటూ సాగె పాటకి దేశ భక్తులు పులకరించి పోతారు.

న్యూ ఇయర్ తో పాటు ఇంకో ఫెస్టివల్ కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు రానుంది. 20 సంవత్సరాల తర్వాత ఖుషి మళ్లీ థియేటర్స్ లో సందడి చేయనుంది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఒక్కడు, పోకిరి, తమ్ముడు , జల్సా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. 20 సంవత్సరాల తర్వాత ఖుషి మళ్లీ థియేటర్స్ లో సందడి చేయనుంది. ఖుషి సినిమా డిసెంబర్ 31న రీరిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు