Ponniyin Selvan : విజువల్ వండర్ గా..

ప్రముఖ దర్శకుడు మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ” పోనియన్ సెల్వన్” పార్ట్ 1. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చియాన్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలతో రూపొందిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ వేడుకను నిర్వహించి పాటలు, ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ఈవెంట్ కు తలైవా రజినీకాంత్, కమల్ హాసన్, జయరాం, కాళిదాసు, మణిరత్నంతో పాటు సుహాసిని పలువురు నటీనటులు, ప్రముఖులు సందడి చేశారు.

ఈ ట్రైలర్ లో “వెయ్యి సంవత్సరాల క్రితం చోళ నాట స్వర్ణ శకం ఉదయించక మునుపు.. ఒక తోకచుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళ రాజకులంలో ఒకరిని ఆ తోకచుక్క బలి కోరుతుందని అంటున్నారు. దేశాన్ని పగలు, ప్రతీకారాలు చుట్టుముట్టాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. వంచన, ద్రోహం, రాజ్యంలోకి చొచ్చుకొని పోతున్నాయి”. అంటూ రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్ తో సాగే ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

చోళ రాజ్య రక్షకుడిని అంటూ జయం రవి ట్రైలర్ లో కనిపించారు. ఈ ట్రైలర్ లో ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళ నటనతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాలో మరో లెవెల్ గా చెప్పవచ్చు. ఈ సినిమా ఐదు భాషలలో 2 పార్టులు గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. తాజా గా వచ్చిన ట్రైలర్ తో ఈ అంచనాలు మరింత పెరిగాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు