Pooja hegde: ఇఫ్తార్ లో బుట్టబొమ్మ అందాల విందు !

ప్రస్తుతం పూజా హెగ్డే ,“కిసీ కా భాయ్ , కిసి కి జాన్ ” సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా ఉంది. సౌత్ లో దాదాపు పెద్ద హీరోలందరితో వర్క్ చేసిన పూజా ఇప్పుడు నార్త్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా, కొద్దీరోజుల్లోనే తెలుగు టాప్ స్టార్స్ అయిన మహేష్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్ , ఎన్టీఆర్ లాంటి హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ కొట్టేసింది. పూజా పుట్టింది ముంబై లో అయిన ఆమెకి లైఫ్ ఇచ్చింది మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే.

వరుణ్ తేజ్ ని హీరోగా లాంచ్ చేస్తున్న సమయంలో హీరోయిన్ గా ఎవరిిని తీసుకోవాలా అని చాలా రీసెర్చ్ చేసారంట. ఎందుకంటే వరుణ్ చాలా హైట్ . అందుకే ఆ హైట్ ని మ్యాచ్ చేయాలి అనుకోని అమ్మాయిని వెతకడం స్టార్ట్ చేసారు. అప్పుడే పూజా ప్రొఫైల్ చూసి సెలెక్ట్ చేసారు శ్రీకాంత్ అడ్డాల. అప్పటికే నాగ చైతన్యతో పూజా ఒక లైలా కోసం సినిమా షూటింగ్ చేస్తుంది. ఆ తరువాత ఈ రెండు సినిమా ఒకదాని తరువాత ఒకటి వెంట వెంటనే రిలీజ్ అవడంతో పూజా ఇక తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

- Advertisement -

వరుసగా సౌత్ సినిమాలు చేస్తూన్న సమయంలో బాలీవుడ్ లోను ఈ భామ కి అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ, మొహంజొదారో లాంటి పెద్ద సినిమాలలో నటించిన కూడా గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తరువాత బాలీవుడ్ టాటా చెప్పి సౌత్ లోనే బిజీ అయిపొయింది. అయితే ఇన్నాళ్ళకి ఏకంగా సల్మాన్ ఖాన్ లాంటి హీరోతో పెయిర్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది.

సల్మాన్ ఖాన్ “కిసీకా భాయ్ కిసి కి జాన్ ” సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉంటుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎలాగైనా పెర్మినెంట్ హీరోయిన్ గా మారిపోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సినిమా ప్రమోషన్స్ కోసం వాడేస్తుంది. రీసెంట్ గా మహారాష్ట ఎంపీ బాబా సిద్దిఖ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకి అటెండ్ అయినా పూజా బ్లాక్ లో సారీ లో కనిపించి అందరి అటెన్షన్ కి గ్రాబ్ చేసింది. మరి పూజ ఎన్నో ఆశలు పెట్టుకున్న భాయ్ సినిమా తన కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు